Namratha: ఇందిరను తలచుకుంటూ నమ్రత భావోద్వేగ పోస్ట్‌...!

ప్రముఖ నటుడు ఘట్టమనేని కృష్ణ భార్య, నటుడు మహేష్‌ బాబు తల్లి ఇందిరాదేవి బుధవారం మరణించిన విషయం తెలిసిందే. ఆమె మరణంతో కుటుంబసభ్యులంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Published : 01 Oct 2022 02:21 IST

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు ఘట్టమనేని కృష్ణ భార్య, నటుడు మహేష్‌ బాబు తల్లి ఇందిరాదేవి బుధవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె మరణంతో కుటుంబ సభ్యులంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇండస్ట్రీ పెద్దలతో పాటు రాజకీయ నాయకులు, ప్రముఖులు నివాళులర్పించారు. అయితే ఇందిరా దేవి మరణం తర్వాత మహేష్‌ భార్య నమ్రత సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు. ఇందిరా దేవి ఫొటోను షేర్‌ చేస్తూ..

‘‘మేము మిమ్మల్ని అనుక్షణం గుర్తుచేసుకుంటూ ఉంటాం. మీరు నాకు పంచిన ప్రేమను నేను కుటుంబసభ్యులందరిపై చూపిస్తాను. వీ లవ్‌ యూ మమ్మీ’’ అని రాశారు. ఈ పోస్ట్‌ చూసిన వారందరూ కామెంట్‌ల రూపంలో నమ్రతకు ధైర్యం చెబుతున్నారు. ‘ఆమెలేని లోటు ఎవ్వరూ తీర్చలేనిది, ధైర్యంగా ఉండండి’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇందిరా దేవి మరణించినప్పటికీ  నుంచి పలువులు సినీ, రాజకీయ ప్రముఖులు, సూపర్‌స్టార్‌ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు