Sushmita Sen: మహేశ్భట్ మాటలతో మొదట బాధపడ్డా..
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మహేశ్భట్(MaheshBhatt) గతంలో తనని అవమానించారని నటి సుస్మితా సేన్ (Sushmita Sen) అన్నారు. తాజాగా సుస్మిత ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. తన కెరీర్పై ఆసక్తికర వ్యాఖ్యలు...
ముంబయి: బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మహేశ్భట్(MaheshBhatt) గతంలో తనని అవమానించారని నటి సుస్మితా సేన్ (Sushmita Sen) అన్నారు. తాజాగా సుస్మిత ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. తన కెరీర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1994లో విశ్వసుందరి కిరీటాన్ని గెలుపొందిన అనంతరం మహేశ్భట్ తనకి ‘దస్తక్’(Dastak) లో ఆఫర్ ఇచ్చారని తెలిపారు.
‘‘యాక్టింగ్ అంటే ఏమిటో తెలియని సమయంలో మహేశ్భట్ నాకు మొదటి అవకాశాన్ని ఇచ్చారు. ‘దస్తక్’తో నన్ను వెండితెరకు పరిచయం చేశారు. ఆ సినిమాలో నటించమని కోరుతూ ఆయన నన్ను కలిసినప్పుడు ‘‘సర్.. నాకస్సలు యాక్టింగ్ రాదు’’ అని చెప్పా. దానికి ఆయన.. ‘‘నువ్వు గొప్ప నటివని ఎవరు చెప్పారు? కానీ నేను గొప్ప దర్శకుడినే’’ అని అన్నారు. ఆయన మాటలపై నమ్మకం ఉంచి ఆ ప్రాజెక్ట్ ఓకే చేశాను. ముహూర్తపు షాట్లో నేను కోపంగా నటించాలి. నాకు చాలా కంగారుగా అనిపించింది. నన్ను గమనించిన ఆయన ఆ వేడుకకి వచ్చిన సినీ ప్రముఖులు, ఇతర మీడియా బృందం ఎదుట నన్ను అవమాన పరిచేలా మాట్లాడారు. నటిగా సరిపోనని అన్నారు. నాకెంతో బాధ, కోపంగా అనిపించింది. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతుంటే మహేశ్ ఆపారు. ‘‘లేదు సర్.. నేను ఉండలేను. మీకింతకు ముందే చెప్పాను నాకు నటన తెలియదని. మీరు ఒప్పించబట్టే సెట్లోకి వచ్చాను. కానీ ఈరోజు మీరు అందరి ముందు నన్ను ఎలా అంటారు’’ అని బాధపడ్డా. దానికి ఆయన.. ‘‘దీన్నే కోపం అంటారు. వెళ్లు, వెళ్లి ధైర్యంగా కెమెరా ముందు యాక్ట్ చెయ్’’ అని అన్నారు. ఆయన అవమానించింది కేవలం నాకు కోపం తెప్పించడానికి మాత్రమేనని అప్పుడు అర్థమైంది. నిజంగానే ఆయన గొప్పదర్శకుడు’’ అని సుస్మితా సేన్ తెలిపారు. 1996లో నటిగా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఎన్నో బాలీవుడ్ ప్రేమకథా చిత్రాల్లో నటించారు. ‘ఫిజా’, ‘నాయక్’, ‘ఫిహాల్’, ‘పైసా వసూల్’ చిత్రాలు ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. 2015లో వచ్చిన బెంగాలీ చిత్రం ‘నిర్బాక్’ తర్వాత నటనకు దూరంగా ఉన్న ఆమె 2020లో ‘ఆర్య’ వెబ్సిరీస్తో కెమెరా ముందుకు వచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సాక్షి వదిన తర్వాత.. ధోనీ భయ్యా ఎత్తుకుంది నన్నే: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ