MaheshBabu: అనుకున్నదే జరుగుతోంది!
‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో.. వాడే పండుగాడు..’ ప్రిన్స్ మహేష్బాబు. క్లాస్ అయినా, మాస్ అయినా.. ఆ పాత్రలపై తనదైన ముద్ర ఉండితీరాల్సిందే. బాక్సాఫీసు దగ్గర హడావిడి
‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో.. వాడే పండుగాడు..’ ప్రిన్స్ మహేష్బాబు. క్లాస్ అయినా, మాస్ అయినా.. ఆ పాత్రలపై తనదైన ముద్ర ఉండితీరాల్సిందే. బాక్సాఫీసు దగ్గర హడావిడి చేయాల్సిందే. ఇటీవల పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చేశారు. ఆ చిత్రం ఈ గురువారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలు...
ఈ సినిమా చేస్తున్నప్పుడు ‘పోకిరి’ రోజులు గుర్తుకొచ్చాయని చెప్పారు మీరు. మీ చిత్రబృందం కూడా అదే మాట అంటోంది. కారణమేంటి?
‘పోకిరి’ అనేది మాస్ యుఫోరియాతో కూడిన సినిమా. అదే తరహా మాస్ అంశాలతో ఈ సినిమా ఉంటుందీ. అలాంటి షేడ్స్ ఉన్న పాత్ర దొరకడంతోనే ‘పోకిరి’ రోజులు గుర్తుకొచ్చాయని చెప్పా. దీని క్రెడిట్ అంతా దర్శకుడికే చెందుతుంది. నా హావభావాలు, సంభాషణలు చెప్పిన విధానం చాలా బాగుంటుంది. పాత్రని చాలా కొత్తగా డిజైన్ చేశారు. ప్రతీ నిమిషం ఆస్వాదిస్తూ చేశా.
నటుడిగా ఇలాంటి పాత్రలు చేయడంలో ఉన్న సౌలభ్యం ఏమిటి?
ఒక కథకి ఏం కావాలో అదే చేస్తాను. దాన్నుంచి బయటికి రాను. ఏ కథయినా సరే, దానికి తగ్గట్టే నటన ఉండాలనుకుంటా. ‘సర్కారు వారి పాట’ కథ, ఇందులోని పాత్రలు వేరు. హద్దులు లేకుండా మరింత ఫ్రీగా ఇలాంటి పాత్రలు చేయొచ్చు. నాలుగేళ్లుగా నా ప్రయాణం అద్భుతంగా సాగుతోంది. ఈ సినిమా మరింత కొత్తగా ఉంటుంది. అభిమానులతోపాటు అందరికీ నచ్చేలా ఉండాలి సినిమాలు. బడ్జెట్లు పెరిగాయి. ఇప్పుడు ప్రయోగాలు కూడా చేయలేం. ఇలాంటి సినిమాలు తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తాయి.
ఈ సినిమా ప్రయాణం ఎలా సాగింది? కరోనా సమయంలో కథలో మార్పులు, చేర్పులేమైనా చేశారా?
కథ పరంగా కాకుండా ‘మ మ మహేషా..’ పాట విషయంలోనే కొంచెం మార్పు చేశాం. మొదట వేరే పాట అనుకున్నాం. సినిమా చూసుకున్నాక ఓ మాస్ పాట ఉంటే బాగుండేదనే అభిప్రాయం కలిగింది. దాంతో మొదటిదాన్ని పక్కన పెట్టి పది రోజుల వ్యవధిలో మ మ మహేషా పూర్తి చేశాం. ఇక సినిమా ప్రయాణం అంటారా? కరోనా వల్ల చాలా క్లిష్టంగానూ, అదే సమయంలో కొత్తగానూ అనిపించింది. ఏ సినిమా అయినా కూడా ఏడెనిమిది నెలల్లో పూర్తి చేసేస్తాం. కానీ, దీనికి రెండేళ్లు ప్రయాణం చేశాం. మానసికంగా శారీరకంగా చాలా కష్టంగా అనిపించింది. ఈ విషయంలో నిర్మాతలకి కృతజ్ఞతలు చెప్పాలి. ‘దూకుడు’, ‘శ్రీమంతుడు’ల నుంచి వాళ్లతో కలిసి ప్రయాణం చేస్తున్నా.
గత సినిమాలతో ఓ బలమైన అంశాన్ని చెప్పారు. మరి ఈ సినిమాతో?
ఇందులో కొత్తగా ప్రయత్నించాం. దాన్ని తెరపై చూసి ఆస్వాదించాలంతే. దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు నన్ను ఆత్రుతకి గురిచేసిన విషయం అదే. పరశురామ్ రచనలో దిట్ట. దర్శకుడు రచయిత కూడా అయితే ఆ ప్రభావం వేరుగా ఉంటుంది. ఈ సినిమాని ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూస్తారు. నాకూ, కీర్తికీ మధ్య సాగే లవ్ ట్రాక్ చాలా బాగుంటుంది. తమన్ సంగీతం బాగా కుదిరింది. తను ఇప్పుడొక సంగీత సంచలనం. ప్రేక్షకులకి ఏ పాట నచ్చుతుందో తనలో చాలా స్పష్టత వుంది. కళావతి పాట ఇచ్చినప్పుడు మాకు మొదట అంత తొందరగా నచ్చలేదు. ‘నన్ను నమ్మండి, మహేష్ కెరీర్లోనే ఒకానొక అత్యుత్తమమైన పాట అవుతుంద’ని చెప్పారు. అదే జరిగింది. నాకు ఇష్టమైన పాట కూడా అదే. సముద్రఖని నటన కూడా ఆశ్చర్యపరుస్తుంది.
ట్రైలర్ చూస్తే కొన్ని ఘాటైన సంభాషణలు సినిమాలో ఉన్నాయనిపిస్తుంది. అవి చెబుతున్నప్పుడు సెట్లో మీకేం అనిపించింది?
ఆ పాత్ర నడవడిక అలా ఉంటుంది. నేను స్క్రిప్ట్కి లొంగిపోయి నటిస్తా. పాత్ర డిమాండ్ చేసినప్పుడు అలాంటి సంభాషణలు చెప్పడానికి ఏమాత్రం వెనకాడను.
పొరుగు భాషల్లో సినిమాలు చేయాలి, అక్కడి మార్కెట్ని కూడా సొంతం చేసుకోవాలనే ఆలోచనలేమైనా చేస్తుంటారా?
మొదట్నుంచీ తెలుగు సినిమాలే చేస్తానని చెబుతున్నా. మన పరిశ్రమ వదిలి వేరే చోటుకి ఎందుకు వెళ్లడం అనేది నా భావన. మనం ఇక్కడ చేసిన తెలుగు సినిమాలే అన్ని భాషల్లోకి వెళ్లాలని చెబుతూ వచ్చా. పదేళ్లుగా నేను అనుకున్నదే ఇప్పుడు నెరవేరుతోంది కదా.. మరి నాకంటే ఆనందం ఇంకెవరికి ఉంటుంది? మన తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ఆడుతుంటే, నా కల నెరవేరిన భావన కలుగుతోంది.
త్రివిక్రమ్తో చేయబోయే సినిమా ఎలా ఉంటుంది?
దాని గురించి ఇప్పుడే మాట్లాడితే తొందరపడినట్టే ఉంటుంది. మా కలయిక అనగానే ఓ ప్రత్యేకమైన ఆత్రుత కనిపిస్తుంది ప్రేక్షకుల్లో. ఆయన రాసే సంభాషణలు అద్భుతం. వాటిని వింటున్నప్పుడు, సెట్లో నటిస్తున్నప్పుడు అది నటనలా ఉండదు. మేం ఇద్దరం ఎప్పుడు స్క్రిప్ట్ గురించి మాట్లాడుకున్నా, ఫోన్లో ఫలానా సన్నివేశం ఇలా వచ్చిందని చెప్పినా మనసులో వేరే రకమైన తృప్తి కలుగుతుంది. ఎప్పుడెప్పుడు ఆ సినిమా సెట్స్కి వెళదామా అని ఎదురు చూస్తున్నా. చాలా కొత్తగా ఉంటుంది ఆ సినిమా.
తదుపరి రాజమౌళితో సినిమా చేస్తున్నారు కదా..?
నేను, రాజమౌళి కలిసి సినిమా చేస్తున్నప్పుడు చాలానే ఊహిస్తారు కదా? అందుకు తగ్గట్టే ఉంటుంది ఆ సినిమా. ఆయనతో ఒక సినిమా చేస్తే పాతిక సినిమాలు చేసినంత అనుభవం. ఆలస్యమైనా సరే, అందుకు తగ్గట్టే ఉంటుంది.
మీ నాన్న, నటులు కృష్ణ బయోపిక్ కోసం ఎవరైనా సంప్రదించారా?
నన్నెవ్వరూ సంప్రదించలేదు. ఒకవేళ వచ్చినా నేను చేయలేను. ఈ ఆలోచన గురించి వింటుంటేనే నా కాళ్లు వణుకుతున్నాయి. నాన్న నాకు దేవుడితో సమానం. నేను ఆయనలా నటిస్తానని అనుకోను.
కరోనా తర్వాత ట్రెండ్లో పెద్ద మార్పు వచ్చిందని నేననుకోను. ఎప్పటికైనా వాణిజ్య సినిమా వాణిజ్య సినిమానే. ప్రేక్షకుడు థియేటర్లోకి అడుగు పెడితే ఆ సందడి వేరు. అలా కాకుండా కొత్త ట్రెండ్ వచ్చిందని మనం ఏదేదో ప్రయత్నిస్తే అది సరైనది కాదని నా అభిప్రాయం. కాకపోతే మన సినిమా స్థాయి పెద్దదైంది. మన ప్రేక్షకులు పెరిగారు. నిర్మాణ వ్యయం పెరిగింది.
ఈ రెండేళ్ల కాలంలో పిల్లలతో కలిసి మరింత సమయం గడిపాను. వాళ్లు ఎంత వేగంగా ఎదిగారో అర్థమైంది. ఈతరంలో చాలా స్పష్టత వుంది. అందుకే గౌతమ్, సితార వాళ్ల నిర్ణయాలు వాళ్లే తీసుకుంటారు. సితారకి నటన అంటే ఇష్టం. అది నాకు గర్వంగా అనిపించింది. యూట్యూబ్, నటన అంటూ సితార ఒక రకమైన పనులు చేస్తే, గౌతమ్ మరో రకమైన ప్రపంచంలో ఉంటాడు. వాళ్ల కలల్ని సాకారం చేయడమే తల్లిదండ్రులుగా మా ముందున్న లక్ష్యం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాఖీభాయ్ లుక్లో యశ్.. కేజీఎఫ్3 కోసమేనా?
కన్నడ నటుడు యశ్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
నెట్ఫ్లిక్స్లో రికార్డు సృష్టించిన ‘ఫైటర్’.. టాప్3లో స్థానం
‘ఫైటర్’ చిత్రం నెట్ఫ్లిక్స్లో రికార్డు నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది చూసిన చిత్రాల్లో టాప్3లో నిలిచింది. -
మేము సహ నటీనటులం మాత్రమే: రాశీఖన్నా
రాశీఖన్నా, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
అక్షయ్తో బ్రేకప్.. ఆత్మహత్య వార్తలపై స్పందించిన రవీనా టాండన్
అక్షయ్ కుమార్ (Akshay Kumar)తో వివాహం రద్దు కావడంపై నటి రవీనా టాండన్ (Raveena Tandon) స్పందించారు. బ్రేకప్ తర్వాత వచ్చిన పలు కథనాల గురించి ఆమె మాట్లాడారు. -
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
‘పుష్ప3’ మూడో భాగానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. -
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
నటుడు సిద్ధార్థ్ (Siddharth), నటి అదితి రావు హైదరీ (Aditi rao Hydari) వివాహం చేసుకున్నారంటూ బుధవారం నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా వీరిద్దరూ స్పందించారు. -
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ‘డీజే టిల్లు’కు సీక్వెల్గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
21 ఏళ్ల తర్వాత అదే రోజున వస్తున్నాం: ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్పై దిల్రాజు
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) పరశురామ్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. -
చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పేంకాదని తెలుసుకున్నా: ప్రియమణి
జాతీయ అవార్డు అందుకున్న తర్వాతే కథల ఎంపికలో మార్పు వచ్చిందని ప్రియమణి అన్నారు. -
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు. ఆయన హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఓటీటీలోకి అభినవ్ గోమఠం కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్తో తెలుగు ప్రేక్షకుల్లో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు నటుడు అభినవ్ గోమఠం (Abhinav Gomatam). ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నయ్ రా’ (MasthuShadesUnnaiRa). -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
రామ్చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
ఆట మార్చే మాస్ పాట
‘సిక్స్ ప్యాక్లో యముడండీ... సిస్టమ్ తప్పితే మొగుడండీ...’ అంటూ రామ్చరణ్ పాత్ర తీరుతెన్నుల్ని పరిచయం చేసింది ‘గేమ్ ఛేంజర్’ పాట. రామ్చరణ్ కథానాయకుడిగా... శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. -
తెలుగు సినిమాకి కావల్సింది సహజత్వమే!
భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుల్లో కె.యు.మోహనన్ ఒకరు. బాలీవుడ్లో షారుక్ఖాన్, ఆమిర్ఖాన్, అక్షయ్ కుమార్ తదితర అగ్ర కథానాయకులతో సినిమాలు చేశారు. కెమెరాతో ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తున్న ఆయన తెలుగులో ‘మహర్షి’ తర్వాత ‘ఫ్యామిలీస్టార్’ చిత్రానికి పనిచేశారు. -
నయన్... నాయికా ప్రాధాన్య చిత్రం?
ఆకర్షించే అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే అగ్రతారల్లో ఒకరు నయనతార. పాత్ర ఏదైనా తన నటనతో అభిమానులను మెప్పిస్తుందీ భామ. -
అదే కాంబో కొత్త చిత్రం?
‘బూమ్’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది బాలీవుడ్ నాయిక కత్రినా కైఫ్. తొలి సినిమాకే అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్తో తెరను పంచుకునే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ‘మల్లీశ్వరి’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కత్రినా. -
అదితిరావ్, సిద్ధార్థ్ల పెళ్లి!
కథానాయకుడు సిద్ధార్థ్, నాయిక అదితిరావ్ హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. బుధవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. -
గాయంతోనే చిత్రీకరణ పూర్తి చేశా
‘దిల్ సే సోల్జర్..దిమాక్ సే సైతాన్స్’ అంటూ యాక్షన్ హంగామా మొదలుపెట్టారు బాలీవుడ్ కథానాయకులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్. వారిద్దరూ కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమే ‘బడేమియా ఛోటేమియా’.
తాజా వార్తలు (Latest News)
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!