Maheshbabu: అభిమానులకు మహేశ్‌ లేఖ.. జూన్‌ నుంచి షూట్‌

తన అభిమానులను ఉద్దేశించి సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ఓ లేఖ రాశారు. ‘సర్కారు వారి పాట’ విడుదలను పురస్కరించుకుని ఆయన ఈ లేఖ విడుదల చేశారు. ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ...

Published : 07 May 2022 16:54 IST

హైదరాబాద్‌: తన అభిమానులను ఉద్దేశించి సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ఓ లేఖ రాశారు. ‘సర్కారు వారి పాట’ విడుదలను పురస్కరించుకుని ఆయన ఈ లేఖ విడుదల చేశారు. ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ థియేటర్లలోనే చూడాలని కోరారు. ‘‘ప్రియమైన అభిమాన మిత్రులకు, యువ దర్శకుడు పరశురామ్‌ దర్శకత్వం వహించిన ‘సర్కారు వారి పాట’ మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఆల్బమ్‌ విశేష సంచలనం సృష్టిస్తోంది. ఎన్నో అంచనాలతో విడుదల కానున్న ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ థియేటర్లలోనే చూసి మీ స్పందన తెలియజేయగలరు. ఇక, హారికా హాసిని క్రియేషన్స్‌ పతాకంపై త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో నా తదుపరి సినిమా రెగ్యులర్‌ షూట్‌ జూన్‌ నుంచి ప్రారంభం కానుంది’’ అని మహేశ్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లేఖ నెట్టింట వైరల్‌గా మారింది. కమర్షియల్‌  ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ‘సర్కారు వారి పాట’ చిత్రంలో మహేశ్‌కు జోడీగా నటి కీర్తి సురేశ్‌ సందడి చేయనున్నారు. ఇందులో మహేశ్‌ మరింత యంగ్‌ లుక్‌లో కనిపించనున్నారు. తమన్ స్వరాలు అందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు