Tollywood: సీఎంతో భేటీ.. సినీ ప్రముఖుల ప్రతిపాదనలివే..!

సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి జగన్‌తో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు భేటీ అయిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో సినిమా టికెట్‌ ధరల పెంపు గురించి ....

Updated : 10 Feb 2022 15:29 IST

అమరావతి: సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి జగన్‌తో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు భేటీ అయిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో సినిమా టికెట్‌ ధరల పెంపు గురించి చర్చించేందుకు ముఖ్యమంత్రిని కలిసిన చిరంజీవి, రాజమౌళి, ప్రభాస్‌, మహేశ్‌బాబు, కొరటాల శివ, నిరంజన్‌రెడ్డి తదితరులు పరిశ్రమ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పలు ప్రతిపాదనలను ఏపీ సర్కారు ఎదుట ఉంచినట్లు తెలుస్తోంది.

ఎంపిక చేసిన పలు చిత్రాలకు సబ్సిడీ, జీఎస్టీ మినహాయింపు, ప్రభుత్వ, చారిత్రక ప్రాంతాల్లో షూటింగ్‌లకు అద్దె మినహాయింపు, ఆన్‌లైన్‌ టికెట్‌ అమలు ఫిల్మ్‌ ఛాంబర్‌కు అప్పగించడం, చిన్న, మధ్య సినిమాలకు కూడా ఐదో షోకి అనుమతి, టాలీవుడ్‌కు పరిశ్రమ హోదా ఇవ్వడం, ఏటా నంది అవార్డులు అందజేయడం, డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు ఛార్జీల మినహాయింపు, విద్యుత్తు సబ్సిడీ, థియేటర్లకు ప్రాపర్టీ ట్యాక్స్‌ మినహాయింపు వంటి ప్రతిపాదనలపై సీఎం జగన్‌తో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీకి నటులు అలీ, పోసాని కృష్ణ మురళీ, ఆర్‌.నారాయణమూర్తి తదితరులు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని