బాలీవుడ్‌ ‘యుధ్రా’లో  మాళవికా మోహన్‌ 

‘మాస్టర్’‌ చిత్రంలో విజయ్‌ సరసన కథనాయికగా అలరించిన నటి మాలవికా మోహన్‌.  ఈ అందాల భామ బాలీవుడ్‌లో రవి ఉదయవార్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘యుధ్రా’ అనే చిత్రంలో నాయికగా నటిస్తోంది.

Updated : 15 Feb 2021 18:33 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ‘మాస్టర్’‌ చిత్రంలో విజయ్‌ సరసన కథానాయికగా అలరించిన నటి మాళవికా మోహన్‌. ఈ అందాల భామ బాలీవుడ్‌లో రవి ఉదయవార్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘యుధ్రా’ అనే చిత్రంలో నాయికగా నటిస్తోంది. ‘గల్లీ బాయ్’ నటుడు సిద్ధాంత్‌ చతుర్వేది కథానాయకుడు. తాజాగా ఈ సినిమా గురించి నిర్మాణ సంస్థ తన ట్విటర్‌లో ప్రకటించింది. ఎక్సెల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్‌లో రూపొందుతున్న చిత్రానికి రితేష్‌ సిధ్వాని, ఫర్హాన్‌ అక్తర్‌ నిర్మాతలు. యాక్షన్, థ్రిల్లర్‌ నేపథ్యంగా రూపొందుతున్న ఇందులో మాళవికా - సిద్ధాంత్‌ కలిసి నటించడం ఇదే తొలిసారి. సినిమాకి సంబంధించిన వీడియోను కూడా ఈరోజు విడుదల చేశారు. వచ్చే ఏడాది వేసవిలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మాళవిక గతంలో రజనీకాంత్‌తో కలిసి ‘పేట’ చిత్రంలో కనువిందు చేసింది. సిద్ధాంత్‌ ప్రస్తుతం కత్రీనా కైఫ్‌తో కలిసి ‘ఫోన్‌ బూత్’‌ చిత్రంలో నటిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని