Anupama: పరీక్ష రాయకుండానే పాసైన అనుపమ

పరీక్షకు హాజరుకాకుండానే బిహార్‌ రాష్ట్రం నిర్వహించిన సెకండరీ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఎస్‌.టి.ఇ.టి) పాసైంది మలయాళీ నటి అనుపమ పరమేశ్వరన్‌. అదెలా అనుకుంటున్నారా?

Published : 26 Jun 2021 01:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పరీక్షకు హాజరుకాకుండానే బిహార్‌ రాష్ట్రం నిర్వహించిన సెకండరీ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఎస్‌.టి.ఇ.టి) పాసైంది మలయాళీ నటి అనుపమ పరమేశ్వరన్‌. అదెలా అనుకుంటున్నారా? అయినా అనుపమకి టీచర్‌ ఉద్యోగం ఎందుకనే సందేహంలో ఉన్నారా? అయితే ఇది చదివేయండి.. బిహార్‌ విద్యా శాఖ 2019లో నిర్వహించిన ఎస్‌.టి.ఇ.టి ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. సంబంధిత వెబ్‌సైట్‌లో రిషికేశ్‌ కుమార్‌ అనే వ్యక్తి తన స్కోర్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోగా అందులో నటి అనుపమ ఫొటో తన కంటపడింది. వ్యక్తిగత వివరాలన్నీ తనవే ఉన్నా ఫొటో మాత్రం అనుపమది ఉండటంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. దాంతో ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు రిషికేశ్‌. ప్రస్తుతం అనుపమ ఫొటో ఉన్న స్కోర్‌ కార్డు నెట్టింట వైరల్‌ అవుతోంది. సదరు వ్యక్తి మ్యాథ్స్‌ పేపర్‌ 1లో 150కిగాను 77, పేపర్‌ 2లో 95 మార్కులు సంపాదించారు. దీన్ని చూసిన నెటిజన్లు అవి అనుపమ సాధించిన మార్కులంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటనపై పలువురు రాజకీయ ప్రముఖులు స్పందించారు. బిహార్‌ రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాలు బిహార్‌కి కొత్తేమీ కాదు. గతంలోనూ పలుమార్లు తప్పిదాలు జరిగాయి. రెండేళ్ల క్రితం వెలువడిన జూనియర్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష ఫలితాల్లో బాలీవుడ్‌ నటి సన్నీ లియోనీ 98.5 మార్కులు తెచ్చుకుని, టాపర్‌గా నిలిచింది మరి.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని