Govind Padmasoorya:దేనికైనా సిద్ధం
తెలుగు ప్రేక్షకుల పిలుపు ప్రత్యేకం అంటున్నారు నటుడు గోవింద్ పద్మసూర్య. పాత్రల పేర్లని గుర్తు పెట్టుకుని మరీ... ఆ పేర్లతోనే పిలుస్తుంటారని, ఇప్పుడు ఎక్కడి కెళ్లినా తనని ఆది అంటూ పలకరిస్తున్నారని తెలిపారు. మలయాళంలో కథానాయకుడైన గోవింద్ పద్మసూర్య తెలుగులో ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో పరిచయమయ్యారు.
తెలుగు ప్రేక్షకుల పిలుపు ప్రత్యేకం అంటున్నారు నటుడు గోవింద్ పద్మసూర్య. పాత్రల పేర్లని గుర్తు పెట్టుకుని మరీ... ఆ పేర్లతోనే పిలుస్తుంటారని, ఇప్పుడు ఎక్కడి కెళ్లినా తనని ఆది అంటూ పలకరిస్తున్నారని తెలిపారు. మలయాళంలో కథానాయకుడైన గోవింద్ పద్మసూర్య తెలుగులో ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో పరిచయమయ్యారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘బంగార్రాజు’లో ఆది అనే ప్రతినాయకుడి పాత్రలో మెరిశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు. పండగకొచ్చిన ‘బంగార్రాజు’తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం ఎంతో తృప్తినిచ్చిందని, ప్రస్తుతం తాను తెలుగు నేర్చుకుంటున్నానని తెలిపారు. ‘‘మలయాళంలోనే నా సినీ ప్రయాణం మొదలైంది. హీరోగానే పరిచయమయ్యా. ఆ తర్వాత మమ్ముట్టి, సురేష్గోపి తదితర స్టార్స్తో కలిసి నటించా. తమిళంలో జీవా చేసిన ‘కీ’లో ప్రతినాయకుడిగా నటించా. ఆ సినిమా చూసే దర్శకుడు త్రివిక్రమ్ నాకు ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చారు. నేను చూసిన తొలి తెలుగు చిత్రం ‘అతడు’. ఆ సినిమాని తెరకెక్కించిన త్రివిక్రమ్ దర్శకత్వంలోనే నేను తెలుగుకి పరిచయం కావడం థ్రిల్లింగ్గా అనిపించింది. అది తమిళం, మలయాళంలో విడుదల కావడంతో నాకు మంచి గుర్తింపు లభించింది. ‘బంగార్రాజు’లో నాగార్జునతో కలిసి తెరను పంచుకోవడం నా కెరీర్లో ఓ గొప్ప జ్ఞాపకం. ఆయనతో కలిసి నటించడం నాకొక గొప్ప పాఠం. ‘బంగార్రాజు’ కోసం చేసిన ప్రయాణంలో నాగచైతన్య, దర్శకుడు కల్యాణ్కృష్ణ నాకు మంచి మిత్రులయ్యారు. కృతిశెట్టిని చూసి నేను తెలుగు నేర్చుకోవడం మొదలు పెట్టా’’ అన్నారు. హీరో, విలన్, కామెడీ... ఎలాంటి పాత్రకైనా తనలోని నటుడు సిద్ధమే అన్నారు గోవింద్ పద్మసూర్య. నాని సోదరి దీప్తి దర్శకత్వం వహిస్తున్న ‘మీట్ అండ్ క్యూట్’లోనూ, త్వరలోనే మొదలు కానున్న మేర్లపాక గాంధీ సినిమాలోనూ నటిస్తున్నట్టు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు