Sumanth: ‘మళ్లీ మొదలైంది’.. వచ్చేది ఆరోజే

సుమంత్‌, వర్షిణీ సౌందర్‌ రాజన్‌, నైనా గంగూలి నాయకానాయికలుగా నటించిన చిత్రం ‘మళ్లీ మొదలైంది’. టీజీ కీర్తి కుమార్‌ తెరకెక్కించారు. రాజశేఖర్‌ రెడ్డి నిర్మాత. ఈ సినిమా ఫిబ్రవరి 11న ఓటీటీ వేదిక జీ5లో నేరుగా విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర దర్శక నిర్మాతలు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు.

Updated : 29 Jan 2022 07:04 IST

సుమంత్‌, వర్షిణీ సౌందర్‌ రాజన్‌, నైనా గంగూలి నాయకానాయికలుగా నటించిన చిత్రం ‘మళ్లీ మొదలైంది’. టీజీ కీర్తి కుమార్‌ తెరకెక్కించారు. రాజశేఖర్‌ రెడ్డి నిర్మాత. ఈ సినిమా ఫిబ్రవరి 11న ఓటీటీ వేదిక జీ5లో నేరుగా విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర దర్శక నిర్మాతలు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. ‘‘విడాకులు తీసుకున్న ఓ యువకుడు.. తన న్యాయవాదితో ఎలా ప్రేమలో పడ్డాడు? ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది ఈ చిత్ర కథాంశం. ఇందులో సుమంత్‌ భార్యగా వర్షిణీ కనిపించనుండగా.. న్యాయవాది పాత్రను నైనా పోషించింది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఛాయాగ్రహణం: శివ.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని