మోహన్‌బాబుకు లక్ష్మి సర్‌ప్రైజ్‌

తన తండ్రి మోహన్‌బాబుకు నటి మంచు లక్ష్మి స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. తరచూ షూటింగ్స్‌, ఇతర పనులతో బిజీ బిజీగా ఉండే మంచువారి కుటుంబం(మోహన్‌బాబు దంపతులు, లక్ష్మి దంపతులు) గత కొన్నిరోజుల క్రితం వెకేషన్‌ కోసం మాల్దీవులకు వెళ్లారు....

Published : 24 Jan 2021 01:44 IST

సాయంకాలాన.. సాగరతీరాన..!

హైదరాబాద్‌: తన తండ్రి మోహన్‌బాబుకు నటి మంచు లక్ష్మి స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. తరచూ షూటింగ్స్‌, ఇతర పనులతో బిజీగా ఉండే మంచువారి కుటుంబం(మోహన్‌బాబు దంపతులు, లక్ష్మి దంపతులు) ఇటీవల వెకేషన్‌ కోసం మాల్దీవులకు వెళ్లింది. ఈ టూరుకు సంబంధించిన ఫొటోలను లక్ష్మి నెట్టింట్లో పోస్ట్‌ చేశారు.

‘గత రాత్రి.. బీచ్‌లో విందు ఏర్పాటు చేసి మా నాన్నను సర్‌ప్రైజ్‌ చేశాను. మా నాన్న నటించిన చిత్రాల్లోని కొన్ని పాటలను వింటూ.. సాగర అందాలను తిలకిస్తూ.. ఇష్టమైన భోజనాన్ని ఆస్వాదించాం. ఇలా.. మాకోసం మేము ప్రత్యేకంగా కొంత సమయాన్ని గడిపి చాలారోజులు కావడంతో వ్యక్తిగతంగా ఈ క్షణాలు నాకెంతో ఆనందాన్ని అందించాయి’ అని మంచులక్ష్మి పేర్కొన్నారు.

‘సన్‌ ఆఫ్‌ ఇండియా’లో ప్రస్తుతం మోహన్‌బాబు నటిస్తున్నారు. ఆ సినిమా చిత్రీకరణ గతేడాది ప్రారంభమైంది. మరోవైపు హిందీలో ప్రేక్షకాదరణ పొందిన ‘లస్ట్‌ స్టోరీస్‌’ను తెలుగులో ‘పిట్టకథలు’ పేరుతో రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మంచులక్ష్మి ఓ విభిన్నమైన పాత్రలో నటించారు. ఈ సిరీస్‌ త్వరలో నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా తెలుగువారికి చేరువకానుంది.

ఇదీ చదవండి..

తారక్‌ ట్రాఫిక్‌ జరిమానా చెల్లించిన అభిమాని


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని