manchu manoj: మంచు విష్ణుతో వివాదం.. మోహన్‌బాబు, మనోజ్‌ స్పందన ఇదే!

మంచు విష్ణుతో ఇటీవల నెలకొన్న వివాదంపై మోహన్‌బాబు, మనోజ్‌లు సమాధానం దాటవేశారు. తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన వారు విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేస్తూఅక్కడి నుంచి వెళ్లిపోయారు.

Updated : 06 Apr 2023 17:38 IST

హైదరాబాద్‌ః మంచు విష్ణు (manchu vishnu)తో ఘర్షణకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నకు సినీనటుడు మోహన్ బాబు (Mohan babu), ఆయన తనయుడు మంచు మనోజ్‌ (manchu manoj)లు మాట దాట వేశారు. తిరుపతిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో కట్టాల్సిన ఆస్పత్రిని మారుతీ తిరుపతిలో కట్టారని సకల సదుపాయాలు కల్పించారని అన్నారు. ఈ క్రమంలో ఇటీవల వివాదంపై విలేకరులు ప్రశ్నించగా, మోహన్‌బాబు కాస్త ఘాటుగా స్పందించారు. ‘మీ ఇంట్లో నీ భార్యకు, నీకూ సంబంధం ఏంటో చెప్పగలవా’ అంటూ విలేకరిని ఎదురు ప్రశ్నించారు. మీడియా సోదరులు అంటే తనకు ఎంతో ఇష్టమని ఎప్పుడు ఏది అడగాలో అదే అడగాలని చెబుతూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. అనంతరం మంచు మనోజ్ కూడా మీడియాతో వ్యంగ్యంగా మాట్లాడారు. ‘రీసెంట్‌ ఇష్యూస్‌పై క్లారిటీ ఇస్తే బాగుంటుంది’ అని అడిగిన విలేకరిపై సెటైర్ వేశారు. ‘భుజంపై సెగ్గడ్డ వచ్చింది. ఇదే రీసెంట్‌ ఇష్యూ. వచ్చి గోకుతారా’ అంటూ వ్యంగ్యంగా నవ్వుకుంటూ వెళ్లిపోయారు. త్వరలోనే ‘మనం మనం బరంపురం’ అనే సినిమా మొదలు పెట్టనున్నట్లు మనోజ్‌ ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం మనోజ్‌ స్పందించిన తీరు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని