Manchu Vishnu: ‘జిన్నా’ ఆగమనం ఆలస్యం.. దీపావళి లక్ష్యంగా!

మంచు విష్ణు హీరోగా దర్శకుడు సూర్య తెరకెక్కించిన చిత్రం ‘జిన్నా’. పాయల్‌ రాజ్‌పుత్‌, సన్నీ లియోనీ కథానాయికలు.

Published : 29 Sep 2022 23:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా దర్శకుడు సూర్య తెరకెక్కించిన చిత్రం ‘జిన్నా’ (Ginna). పాయల్‌ రాజ్‌పుత్‌, సన్నీ లియోనీ కథానాయికలు. అక్టోబరు 21న ఈ సినిమాని విడుదల చేస్తున్నామని, దీపావళికి కుటుంబంతో కలిసి ఈ చిత్రాన్ని ఆస్వాదించమని విష్ణు ప్రేక్షకులను కోరారు. ‘జిన్నా’.. కామెడీ ఎంటర్‌టైనర్‌ సినిమా అని ఆయన తెలిపారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ పంచుకున్నారు. ముందుగా.. ఈ సినిమాని దసరా పండగను పురస్కరించుకుని అక్టోబరు తొలి వారంలో రిలీజ్‌ చేయాలని చిత్ర బృందం భావించింది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించిన ఈ సినిమాని మోహన్‌ బాబు సమర్పిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని