Manchu Vishnu: సాయితేజ కుటుంబానికి అండగా మంచు విష్ణు

హెలికాప్టర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్‌ నాయక్‌ సాయితేజ కుటుంబానికి అండగా ఉంటానని సినీ

Published : 09 Dec 2021 18:21 IST

హైదరాబాద్‌: హెలికాప్టర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్‌ నాయక్‌ సాయితేజ కుటుంబానికి అండగా ఉంటానని సినీ నటుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. బుధవారం తమిళనాడులో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో త్రివిధ దళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌తో సహా మొత్తం 13మంది మృత్యువాతపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడ గ్రామానికి చెందిన బి.సాయితేజ(29) దుర్మరణం పాలయ్యారు. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ను మెప్పించి, ఆయన వ్యక్తిగత భద్రత సిబ్బందిలో ఒకరిగా ఎదిగిన సాయితేజ మరణం తెలుగువారిని కలచివేసింది. సాయితేజ మృతి పట్ల సినీ హీరో మంచు విష్ణు  విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. తమ విద్యా సంస్థలో సాయితేజ పిల్లలకు ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. ఇంజినీరింగ్‌ వరకు చదివిస్తామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా ప్రకటన చేశారు.

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని