Manchu Vishnu: నటుడిగా జీవితం బాగుంది.. ‘మా’ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయను: మంచు విష్ణు
నటుడిగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందేందుకు శ్రమిస్తానని, ఇకపై ‘మా’ సహా ఎలాంటి ఎన్నికల్లోనూ తాను పోటీ చేయనని మంచు విష్ణు తెలిపారు. ‘జిన్నా’ సినిమా ప్రచారంలో భాగంగా నిర్వహించిన మీమర్స్/యూట్యూబర్స్ మీట్లో ఆయన మాట్లాడారు.
హైదరాబాద్: నటుడిగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందేందుకు శ్రమిస్తానని, ఇకపై ‘మా’ సహా ఎలాంటి ఎన్నికల్లోనూ తాను పోటీ చేయనని మంచు విష్ణు (Manchu Vishnu) తెలిపారు. ‘జిన్నా’ (Ginna) సినిమా ప్రచారంలో భాగంగా నిర్వహించిన మీమర్స్/యూట్యూబర్స్ మీట్లో ఆయన మాట్లాడారు. విష్ణు హీరోగా ఇషాన్ సూర్య తెరకెక్కించిన చిత్రమిది. సన్నీ లియోనీ, పాయల్ రాజ్పుత్ కథానాయికలు. త్వరలోనే విడుదలకాబోతున్న ‘జిన్నా’ సినిమా విశేషాలతోపాటు విష్ణు పంచుకున్న మరికొన్ని ఆసక్తికర సంగతులివీ..
* అక్టోబరు 5న మరో రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. ‘జిన్నా’ ప్రత్యేకత ఏంటి?
విష్ణు: ‘జిన్నా’ కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటించాలనుకున్నా. మీరు అడిగారు కాబట్టి ఇప్పుడే చెబుతున్నా. ముందుగా అనుకున్నట్టు మన సినిమా ‘జిన్నా’ అక్టోబరు 5న విడుదల కావట్లేదు. అక్టోబరు 21న రానుంది. అక్టోబరు 5న ట్రైలర్ విడుదల చేస్తాం.
* ఇది ఏ జానర్ సినిమా? ఎంత వసూళ్లు చేస్తుందనుకుంటున్నారు?
విష్ణు: ‘చంద్రముఖి’ ఏ జానర్ సినిమానో ఇదీ అలాంటిదే (హారర్ కామెడీ). ఏ నిర్మాత అయినా తన చిత్రం విడుదలై, మంచి విజయం అందుకోవాలనుకుంటాడు. ఈ సినిమా విషయంలో నేను నటుడిని. నాన్న నిర్మాత. నిజం మాట్లాడుకుందాం.. టాప్ 5నటుల జాబితాలో నేను లేను. ఇది అందరికీ తెలిసిందే. టాప్ 5, టాప్ 3, టాప్ 1లో నిలవాలనుంది. దానికి తగ్గ కృషి చేస్తా. ఒక్క అపజయం ఎదురైనప్పుడు దిగులుపడితే ఎలాంటి ఉపయోగం ఉండదు. నటుల జీవితం ప్రతి శుక్రవారం మారిపోతుంటుంది. ఇక్కడ 50 శాతం హార్డ్ వర్క్, 50 శాతం లక్ ఉండాలి. నేను కష్టపడుతున్నా.. అదృష్టం కలిసొస్తుందనుకుంటున్నా. ఈ సినిమాకి భారీ కలెక్షన్లు వస్తాయనే నమ్మకం ఉంది. ఈ చిత్రం నటుడిగా నాకు మంచి పేరు తీసుకొస్తుందనుకుంటున్నా.
* ఏ అగ్ర దర్శకులతో పనిచేయాలనుకుంటున్నారు?
విష్ణు: ఈ జాబితాలో రాజమౌళి ముందుంటారు. గతంలో బాపుగారి దర్శకత్వం వహించిన ఓ సినిమాలో ఓ పాత్ర చేస్తానని ఆయన్ను అడిగా . ‘మీరు అలాంటి చిన్న పాత్రలు చేయకూడదు. మిమ్మల్ని ఎవరో తప్పుదారి పట్టిస్తున్నారు’ అని బాపు అన్నారు. మరికొందరు దర్శకులనీ అలాంటి (కథలో కీలకమైన పాత్ర) అవకాశం ఇవ్వమని అడిగా. కొత్తవారితో కలిసి పనిచేసేందుకు నాకెలాంటి అభ్యంతరం లేదు. ఓకే అని చెప్పిన వారు హ్యాండ్ ఇచ్చారు. ఇండస్ట్రీలో స్నేహితులు, శత్రువులు శాశ్వతం కాదు.
* ‘ఢీ’ సీక్వెల్ అప్డేట్ ఇస్తారా?
విష్ణు: దాని గురించి దర్శకుడు శ్రీను వైట్ల చెబుతారు. ‘ఢీ’ పెద్ద హిట్ అవుతుందని అప్పుడు మేం ఊహించలేదు. అన్ని సినిమాల్లానే దానికీ శ్రమించాం. కొన్ని కొన్ని క్లిక్ అవుతుంటాయి (నవ్వుతూ..)
* సన్నీ లియోనీ గురించి చెబుతారా?
విష్ణు: తను నాకు మంచి స్నేహితురాలు. ఎంపిక చేసుకున్న పాత్రకు న్యాయం చేస్తుంది. ముందుగా ఈ సినిమాలో ఆమె ఫిక్స్ అయ్యాకే దర్శక-రచయితలు నన్ను సంప్రదించారు.
* మోహన్బాబు సినిమాలు రీమేక్ చేయాల్సి వస్తే దేన్ని ఎంపిక చేసుకుంటారు?
విష్ణు: అల్లుడు గారు. నేను ఐదో తరగతి చదువుతున్నప్పుడు విడుదలైందా సినిమా. నాకు మనసుకు బాగా దగ్గరైంది. అందులో చంద్రమోహన్ గారు చెప్పిన ‘బాధ పెట్టే నిజానికన్నా సంతోషపెట్టే అబద్ధం మంచిది’ అనే డైలాగ్ నాకు ఇష్టం. ఈ సంభాషణ నుంచి నేను పాఠం నేర్చుకున్నా.
* కామెడీ విషయంలో ఈ సినిమా ‘ఢీ’ రేంజ్లో ఉంటుందా?
విష్ణు: తప్పకుండా ఉంటుంది. కానీ, హిట్ అనేది మాత్రం ప్రేక్షకుల చేతుల్లో ఉంది. ప్రతి సినిమానీ ఇష్టం పడతాం.. ఒకేలా కష్టపడతాం.. ఫలితం ఎందుకు విభిన్నంగా వస్తుందో ఎవరూ చెప్పలేరు.
* ఫన్ కోసం మేం మీ సినిమాలు చూస్తాం. మరి మీరు?
విష్ణు: విడుదల సమయంలో తొలి కాపీ చూసిన తర్వాత మరోసారి నా చిత్రాలను నేను చూడను. తెరపై నన్ను నేను చూసుకోవటానికి నాకు సిగ్గు. కార్టూన్లను ఎక్కువగా చూస్తుంటా.
* మీరు ‘మా’ ప్రెసిడెంట్గా మళ్లీ పోటీ చేస్తారని తెలిసింది?
విష్ణు: లేదు. నేను మళ్లీ పోటీ చేయను. రాజకీయాల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నానన్నారు. అదీ నిజం కాదు. నటుడిగా నా జీవితం చాలా బాగుంది. నటుడిగా ప్రపంచ వ్యాప్తంగా నాకు గుర్తింపు వచ్చేలా కష్టపడతా.
‘‘నాపై నెగెటివ్ మీమ్స్ వేసిన వారినీ, యూట్యూబ్లో నెగెటివ్ కంటెంట్ పెట్టిన వారినీ పిలిచా. కానీ, టార్గెట్ చేసి రాసేవారిని వదిలిపెట్టను. మీపై ట్రోల్స్ వస్తుంటే పట్టించుకోరేంటి అని ‘మా’ ఎన్నికల సమయంలో చాలామంది నన్ను అడిగారు. అప్పుడు ఎలక్షన్పైనే దృష్టి పెట్టా. ఇప్పుడు ట్రోల్స్ చేసిన వారిపై పెట్టా. నా కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని కొందరు విమర్శించారు. సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. జూబ్లీహిల్స్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీతోపాటు ఓ ప్రముఖ నటుడి ఆఫీసుకు సంబంధించిన ఐపీ అడ్రస్లు బయటపడ్డాయి. ఆడవారిని విమర్శిస్తే ‘మా’ చాలా సీరియస్గా తీసుకుంటుంది’’ అని మంచు విష్ణు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్.
తాజా వార్తలు (Latest News)
-
క్షమాపణలు యాడ్ సైజ్లోనే ప్రచురించారా? పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!