Manchu vishnu: అందుకే స్పందించలేదు: విష్ణు

సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు లేదా చికిత్సనందిస్తున్న వైద్యులు స్పందిస్తేనే బాగుంటుందని అందుకే మీడియా పాయింట్‌ దగ్గర తాను సమాధానమివ్వలేదని

Published : 11 Sep 2021 21:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్: సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు లేదా చికిత్సనందిస్తున్న వైద్యులు స్పందిస్తేనే బాగుంటుందని అందుకే మీడియా పాయింట్‌ దగ్గర తాను సమాధానమివ్వలేదని మంచు విష్ణు మీడియాకు ఓ ట్విటర్‌లో ప్రకటన విడుదల చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతున్న సాయిధరమ్‌ తేజ్‌ను చూసేందుకు మంచు విష్ణు శనివారం అపోలో ఆసుపత్రికి వెళ్లారు. బయటకొచ్చిన ఆయన మీడియాతో మాట్లాడేందుకు ఇష్టపడలేదు. దీనిపై ఆయన ట్విటర్‌లో పోస్ట్‌ పెట్టారు. వారి సన్నిహితులు, వైద్యులు స్పందిస్తేనే బాగుంటుందనే ఉద్దేశం తప్ప.. మీడియాతో కఠినంగా వ్యవహరించాలని నాకు లేదని ఆయన ఆ పోస్ట్‌లో చెప్పుకొచ్చారు. తేజ్‌ మంచి మనసున్నవాడని, తమ కుటుంబానికెంతో సన్నిహితుడని చెప్పిన విష్ణు, మనందరి ప్రార్థనలతో త్వరగా కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు.  మంచు విష్ణుతో పాటు జగపతి బాబు, నవీన్‌ పొలిశెట్టి కూడా తేజ్‌ త్వరగా కోలుకోవాలని ట్విటర్‌లో పోస్ట్‌ పెట్టారు.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని