Mani Ratnam: ‘పొన్నియిన్ సెల్వన్’ కార్యరూపం దాల్చడానికి స్ఫూర్తి ఆ సినిమానే: మణిరత్నం
Mani Ratnam: ‘పొన్నియన్ సెల్వన్’ కార్యరూపం దాల్చడం వెనుక ఉన్న వ్యక్తి గురించి దర్శకుడు మణిరత్నం మరోసారి పంచుకున్నారు.
చెన్నై: ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’కు వచ్చిన అశేష ప్రజాదరణతో దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తన కెరీర్లోనే అత్యున్నత స్థానంలో నిలిచారు. జేమ్స్ కామెరూన్, స్పీల్బర్గ్ వంటి హాలీవుడ్ దర్శకులు సైతం రాజమౌళి దర్శకత్వ ప్రతిభను మెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో కల్ట్ క్లాసిక్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న మణరత్నం చేరారు. రాజమౌళి దర్శకత్వం, పనిపై ఉన్న నిబద్ధత తనని ఎంతో ప్రభావితం చేసిందన్నారు. చెన్నై వేదికగా సౌత్ ఇండియా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ జరిగింది. ఇందులో భాగంగా ‘భవిష్యత్ సినిమా ట్రెండ్’ అనే అంశంపై నిర్వహించిన చర్చా వేదికలో మణిరత్నం (Mani ratnam), ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli), సుకుమార్ (sukumar) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకులు అడిగిన అనేక ప్రశ్నలకు ముగ్గురూ సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని మణిరత్నాన్ని ‘మిమ్మల్ని సానుకూలంగా అత్యంత ప్రభావితం చేసిన అంశం ఏంటి’ అని అడగ్గా, ‘రాజమౌళి అనుకుంటున్నా’ అని సమాధానం ఇచ్చారు.
‘‘రాజమౌళినే ఎందుకో నేను చెబుతా. ‘పొన్నియిన్ సెల్వన్’ను సినిమా తీయాలని ఎన్నో ఏళ్ల నుంచి వేచి చూస్తూ ఉన్నా. ‘బాహుబలి’ వచ్చే వరకూ నాకెలాంటి మార్గం కనిపించలేదు. అందులో ఆసక్తికర విషయ ఏంటంటే, అది రెండు భాగాలుగా రావటం. ఒక కథను అలా తీసి, ప్రేక్షకులకు ఆ సినిమాపై ఆసక్తి సన్నగిల్లకుండా చేయవచ్చని అర్థమైంది. ఒకవేళ బాహుబలి రెండు భాగాలుగా రాకపోయుంటే, నేను ‘పొన్నియిన్ సెల్వన్’ తీసేవాడిని కాదేమో. థ్యాంక్యూ వెరీ మచ్’’ అని మణిరత్నం అన్నారు. అక్కడే ఉన్న రాజమౌళి స్పందిస్తూ ‘సర్, ఇది నా కెరీర్లోనే అతిపెద్ద అభినందన. నిజంగా చాలా పెద్దది’ అన్నారు.
‘పొన్నియిన్ సెల్వన్’ కథను కల్కి కృష్ణమూర్తి మొత్తం 5 భాగాలుగా రాశారు. ఎంజీ రామచంద్రన్, కమల్హాసన్ వంటి లెజెండరీ నటులు సైతం ఈ కథతో సినిమా తీయాలని ప్రయత్నించారు. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. కథకు ఉన్న నిడివి, నిర్మాణ వ్యయం ప్రధాన అడ్డంకిగా మారాయి. ఎట్టకేలకు మణిరత్నం ఈ మూవీని తీర్చిదిద్దారు. గతేడాది విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’, ‘పొన్నియిన్ సెల్వన్’చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. మణిరత్నం చిత్రం ఏకంగా రూ.500కోట్లు వసూలు చేసింది. దీనికి కొనసాగింపుగా ‘పొన్నియిన్ సెల్వన్2’ (PonniyinSelvan2)ను ఏప్రిల్ 28, 2023న తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది.విక్రమ్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, కార్తి, త్రిష జయం రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్ను చూడలేదు: మాధవన్
అజయ్దేవ్గణ్తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్ను చూడలేదన్నారు. -
‘యానిమల్’.. ఎంజాయ్ చేశాను... అసహ్యించుకున్నాను : బాలీవుడ్ దర్శకుడు
‘యానిమల్’ (Animal)పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్. సినిమా గురించి ఒక్క మాటలో ఏం చెప్పాలో తనకు అర్థంకావడం లేదన్నారు. -
అందుకే అవార్డు వేడుకలకు హాజరుకాను: ఆమిర్ ఖాన్
సమయం చాలా విలువైనదని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ఖాన్ అన్నారు. తాజాగా కపిల్శర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన గత చిత్రాల ఫలితాల గురించి స్పందించారు. -
బర్త్డే వేడుకల్లో నాగ్ అశ్విన్ డ్యాన్స్.. వీడియో వైరల్
దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) పుట్టినరోజు వేడుకలు సరదాగా జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ చిత్రానికి సమంత రివ్యూ ఇచ్చారు. -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
‘మంజుమ్మల్ బాయ్స్’(Manjummel Boys)తో విజయాన్ని అందుకున్నారు నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ. తాజాగా వారిపై కేసు నమోదు అయ్యింది. -
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
విజయ్ (Vijay)తో సినిమాపై దర్శకుడు వెట్రిమారన్ (VetriMaaran) క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను ఆయనకు కథ చెప్పిన విషయం నిజమేనన్నారు. -
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
తనపై అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి నటి, బిగ్బాస్ 5 ఫేమ్ శ్వేతా వర్మ (Swetha Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తాజాగా కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
‘ఆదికేశవ’ నటి అపర్ణాదాస్, ‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడు దీపక్ పరంబోల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
మోహన్లాల్ డ్యాన్స్ను షారుక్ ఖాన్ మెచ్చుకున్నారు. షారుక్పై మోహన్లాల్ ప్రశంసలు కురిపించారు. -
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
పవన్కల్యాణ్ కథానాయకుడిగా ఇప్పటికే మూడు సినిమాలు సెట్స్పై ఉన్నాయి. మరి ఆయన నిర్మాతల నుంచి తీసుకున్న అప్పు ఎంతో తెలుసా? -
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
గతంలో ఓ ఆడిషన్లో తనకు ఎదురైన సంఘటన గురించి స్టార్ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె ఎవరంటే? -
మలయాళ సినిమాల హిట్కు కారణమిదే: ఫహాద్ ఫాజిల్
మలయాళ చిత్రాలు వరుస విజయాలు అందుకోవడంపై నటుడు ఫహాద్ ఫాజిల్ ఆనందం వ్యక్తంచేశారు. కంటెంట్ కొత్తగా ఉన్న కారణంగా సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయన్నారు. -
సిబ్బంది పెళ్లిలో సందడి చేసిన విజయ్ దేవరకొండ..
వ్యక్తిగత సిబ్బంది పెళ్లికి వెళ్లి సర్ప్రైజ్ చేశారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
కొంత విరామం తర్వాత ‘హీరామండీ’తో పలకరించేందుకు సిద్ధమయ్యారు నటి మనీషా కొయిరాలా. దీని ప్రమోషన్స్లో తన కెరీర్కు సంబంధించిన ఓ విషయాన్ని పంచుకున్నారు. -
పెళ్లి పీటలెక్కనున్న యంగ్ హీరోయిన్.. వైరలవుతోన్న హల్దీ ఫొటోలు..
హీరోయిన్ అపర్ణ దాస్ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. హల్దీ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప2’లో కన్నడ నటుడు తారక్ పొన్నప్ప కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా తన పాత్ర గురించి వివరించారు. -
మహేశ్బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్