‘ఆచార్య’.. బాక్సులు బద్దలవుతాయ్
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడు తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ తప్పకుండా బాక్సులు బద్దలుకొడుతుందని ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి అన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా నుంచి ఇటీవల..
లాహే లాహే సక్సెస్పై రచయిత, సంగీత దర్శకుడు
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ తప్పకుండా బాక్సులు బద్దలుకొడుతుందని ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి అన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా నుంచి ఇటీవల ‘లాహే లాహే’ పాట విడుదలై యూట్యూబ్లో దూసుకెళ్తోంది. పరమశివుడు-పార్వతిదేవిల ఏకాంత సమయాన్ని తెలియజేసే విధంగా రచించిన ఈ పాట ప్రతి ఒక్కర్నీ ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో ‘లాహే లాహే’ గురించి చిత్ర సంగీత దర్శకుడు మణిశర్మ, రచయిత రామజోగయ్యశాస్త్రి చెప్పిన కొన్ని విశేషాలు..
అలా రాశా: రామజోగయ్యశాస్త్రి
‘‘కొరటాల శివ ఆలోచనలు ఎప్పుడూ భిన్నంగా ఉంటాయి. ఆయన మనసులో మాటల్ని కొద్దిగా మాత్రమే బయటకు చెబుతారు. జడలు విరబూసుకున్న అమ్మవారి రూపానికి సంబంధించి ఓ విజువల్ ఆయన మనసులో ఉంది. అది ఎక్కడో ఒకచోట ఈ పాటలో రావాలని ఆయన అనుకున్నారు. అలా ఈ పాట రాశాను. సాధారణంగా శివుడు గురించి పాట రాయవచ్చు. అలాగే అమ్మవారి గురించి విడిగా రాయవచ్చు. కానీ వాళ్లిద్దరి ఏకాంత సమయాన్ని.. వాళ్ల మధ్య జరిగే చిన్న చిన్న విషయాలను చమత్కారంగా చెప్పే అవకాశం రావడం అనేది ఒక సువర్ణావకాశమనే చెప్పాలి. జనాలకు మరింత చేరువ కావాలనే ‘లాహే లాహే’ పదాలు ఉపయోగించాం’’
వేదపండితుల నుంచి ఫోన్ కాల్స్ : మణిశర్మ
‘‘మొదటిసారి ‘లాహే లాహే’ లిరిక్స్ చూడగానే తెలియని వైబ్రేషన్స్ వచ్చాయి. వెంటనే ఆపాటకు ట్యూన్ చేయాలనిపించింది. ఇక, పాట విడుదలయ్యాక వేద పండితుల నుంచి నాకు మెస్సేజ్లు, ఫోన్ కాల్స్ మొదలయ్యాయి. ప్రశంసలు కురిపించారు’’
చిన్న భయం: రామజోగయ్య శాస్త్రి
‘‘పాట రిలీజ్ అంటే ఒక చిన్న భయం ఉంటుంది. ఎందుకంటే కథ, సందర్భం ఏమీ బయటకు చెప్పలేం. మెగా ఫ్యామిలీ, ముఖ్యంగా చిరంజీవి అభిమానులకు ఉన్న అంచనాలు వేరే స్థాయిలో ఉంటాయి. పాట అనగానే మొదట వాళ్లు వేరే ఏదో ఊహించుకుంటారు. ఇలాంటి భక్తిపరమైన పాటను విడుదల చేస్తే ఏమైనా నిరాశకు గురి అవుతారా? అనే భయం విడుదలకు ముందు ఉంది. కానీ పాట విడుదలయ్యాక అందరూ దాన్ని బాగా ఆదరించారు. మా పాటను ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. పాట విడుదలైన రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పదిగంటల వరకూ సోషల్మీడియాలో వచ్చిన కామెంట్లకు రిప్లైలు ఇచ్చాను. అలాగే వేద పండితులు కూడా ఫోన్ చేశారు’’
గొప్పతనం శివదే: మణిశర్మ
‘‘పాటంటే ప్రతి పదం కూడా స్పష్టంగా వినిపించాలి. ఇది నా మొదటి సినిమా నుంచి నేను ఫాలో అవుతున్న నియమం. ఈ పాటకు సంబంధించి శాస్త్రిగారిని, నన్నూ ఎంతో ప్రోత్సహించిన దర్శకుడు కొరటాలశివకే ఈ క్రెడిట్ దక్కుతుంది. ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలున్నాయి. ఇప్పటికే నాలుగు పాటలకు కంపోజింగ్ పూర్తి చేశాం. ఇక, ‘లాహే లాహే’ పాట విని చిరు అన్నయ్య నాకు ఫోన్ చేసి 15 నిమిషాలు మాట్లాడారు’’
శివ.. గొప్ప మనిషి: రామజోగయ్య శాస్త్రి
‘‘కొరటాల శివతో నాది దాదాపు నాలుగు సినిమాల ప్రయాణం. ఆయనలో ఉండే గొప్పలక్షణం ఏమిటంటే.. రచయితలను గౌరవిస్తారు. ఒకవేళ ఏదైనా లిరిక్స్ని ఫోన్లో పంపించినా సరే దానిని పైకి చదివి పక్కవాళ్లతో చెప్పి మమ్మల్ని మెచ్చుకుంటారు. ‘ముసలి తాత ముడతముఖం’ సాంగ్ రాసిన సమయంలో లొకేషన్కు వెళ్లి ఆయనతో చెప్పాను. వెంటనే అసిస్టెంట్ డైరెక్టర్స్ అందర్నీ దగ్గరకు పిలిపించి మరీ ఆ పాట మరోసారి నాతో పాడించారు. వాళ్లందరి ముందు నా పాట బాగుందని చెప్పారు. ఆయన గొప్ప వ్యక్తి’’
ఆ కోరిక ఇలా తీరింది: రామజోగయ్య శాస్త్రి
‘‘చిరంజీవి చిత్రానికి ఓ పాట రాయాలనే కోరిక నాలో ఎప్పటి నుంచో ఉంది. ‘ఖైదీ నం:150’లో ‘రైతన్న’ పాట రాశాను. కానీ ఆయనకు తగ్గట్టు పాట రాయాలనే కోరిక నాకు అలాగే మిగిలింది. చిరుతో ఇది నాకు సెకండ్ సాంగ్. నా ఎదురుచూపులకు ఓ మంచి అవకాశం ఈ పాటతో దక్కింది. ఆ పాట విని చిరు నాకు ఫోన్ చేసి అభినందించారు. మెగాస్టార్ లాంటి పెద్ద వ్యక్తి నాలాంటి వాడికి ఫోన్ చేసి ప్రశంసిస్తారని ఊహించనేలేదు. ఈ సినిమా తప్పకుండా బాక్సులు బద్దలు కొడుతుంది’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్.
తాజా వార్తలు (Latest News)
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా