ఇలాంటి పనులు ఎందుకు చేస్తారో.. నటి ఫైర్‌

కరోనా వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు ఫ్రంట్‌లైన్‌ వారియర్‌గా తప్పుడు గుర్తింపు కార్డును సృష్టించిందని ‘బంగారం’ నటి మీరా చోప్రాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టీకా కోసం నటి మీరా నకిలీ గుర్తింపు కార్డు సృష్టించారని ముంబయికి చెందిన భాజపా నేత నిరంజన్‌ పోస్టు చేయడంతో నెటిజన్లు ఆమెపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

Published : 02 Jun 2021 01:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు ఫ్రంట్‌లైన్‌ వారియర్‌గా తప్పుడు గుర్తింపు కార్డును సృష్టించిందని ‘బంగారం’ నటి మీరా చోప్రాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టీకా కోసం నటి మీరా నకిలీ గుర్తింపు కార్డు సృష్టించారని ముంబయికి చెందిన భాజపా నేత నిరంజన్‌ పోస్టు చేయడంతో నెటిజన్లు ఆమెపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే దీనిపై మీరాచోప్రా స్పందించింది. ఆ గుర్తింపుకార్డు తనది కాదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆమె పేర్కొంది.

‘మనం అందరం వ్యాక్సిన్‌ వేయించుకోవాలని కోరుకుంటున్నాం. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా నేను కూడా వ్యాక్సిన్‌ కోసం నాకు తెలిసినవాళ్ల సాయం కోరాను. దాదాపు నెల రోజులుగా వ్యాక్సిన్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నాను. మొత్తానికి వ్యాక్సిన్‌ కోసం రిజిస్టర్‌ చేసుకున్నాను. అందులో భాగంగానే ఆధార్‌కార్డు సమర్పించమనడంతో దాన్ని పంపించాను. అయితే.. ఆధార్‌ను మార్ఫింగ్‌ చేసి.. తప్పుడు గుర్తింపు కార్డు తయారు చేశారు. ఆ కార్డుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు ఆధార్‌ కార్డు తప్ప మరే గుర్తింపు కార్డు లేదు. ఒకవేళ వేరే ఏదైనా గుర్తింపు కార్డు సమర్పిస్తే దానిపై మనం సంతకం చేస్తేనే అది చెల్లుతుంది. దానిపై నా సంతకం లేదు. ఇలాంటి తప్పుడు చర్యలను నేను పూర్తిగా ఖండిస్తున్నాను. అసలు ఇలాంటి పనులు ఎందుకు చేస్తారో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నా’ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. గతంలోనూ ఒకసారి జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎవరో తనకు తెలియదని చెప్పి విమర్శలు ఎదుర్కొందీ భామ. నటి ప్రియాంక చోప్రాకు వరుసకు సోదరి అయ్యే ఈమె ‘బంగారం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇప్పుడు పలు బాలీవుడ్‌ వెబ్‌సిరీస్‌లు, సినిమాల్లో నటిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని