చిరు-బాబీ.. సినిమా ఆ రేంజ్‌లో ఉంటుందట!

మెగాస్టార్ చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో రానున్న సినిమా మెగా అభిమానులకు ఫుల్‌ ట్రీట్‌ కానుందని నిర్మాతలు నవీన్‌, రవి శంకర్‌ తెలిపారు. చిరంజీవి, బాబీ కాంబోలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై త్వరలో ఓ సినిమా పట్టాలెక్కనున్న...

Published : 11 Feb 2021 15:12 IST

ఫ్యాన్స్‌కు ఫుల్‌ ట్రీట్‌ అంటోన్న నిర్మాతలు

హైదరాబాద్‌: మెగాస్టార్ చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో రానున్న సినిమా మెగా అభిమానులకు ఫుల్‌ ట్రీట్‌ కానుందని నిర్మాతలు నవీన్‌, రవి శంకర్‌ తెలిపారు. చిరంజీవి, బాబీ కాంబోలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై త్వరలో ఓ సినిమా పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆ సినిమా కథ గురించి నిర్మాతలు ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండనుందని తెలిపారు.

‘ఇది పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. మెగాస్టార్‌ నటించిన ‘ఘరానా మొగుడు’, ‘రౌడీ అల్లుడు’, ‘గ్యాంగ్‌లీడర్‌’, ‘ముఠామేస్త్రి’.. ఆ స్టైల్‌లో ఈ సినిమా కథ ఉంటుంది. సినీ ప్రియులకు ఇది ఫుల్ ట్రీట్‌ కానుంది. మేము కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.’ అని వివరించారు.

వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి జంటగా నటించిన ‘ఉప్పెన’ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నిర్మితమైంది. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు, మెగాస్టార్‌ ప్రస్తుతం ‘ఆచార్య’ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఆచార్య’ తర్వాత చిరు ‘లూసిఫర్‌’ రీమేక్‌, ‘వేదాళం’ రీమేక్‌ పనుల్లో బిజీ కానున్నారు.

ఇదీ చదవండి

క్రేజీ కాంబోలో భారీ ప్రాజెక్ట్‌లు ఫిక్స్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని