AlluArjun: నేను ఎందుకూ పనికిరానని.. రూ.పది లక్షలు ఇచ్చారు: అల్లు అర్జున్
ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) శత జయంతిని పురస్కరించుకొని ‘అల్లు రామలింగయ్య’ పుస్తకావిష్కరణ కార్యక్రమం శనివారం రాత్రి హైదరాబాద్లో వేడుకగా జరిగింది.
హైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) శత జయంతిని పురస్కరించుకొని ‘అల్లు రామలింగయ్య’ పుస్తకావిష్కరణ కార్యక్రమం శనివారం రాత్రి హైదరాబాద్లో వేడుకగా జరిగింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘‘నాకు 16 ఏళ్లు వచ్చేవరకూ తాతయ్య, నానమ్మలతోనే ఉన్నాను. తాతయ్య చనిపోయాక రూ.10 లక్షల ఇన్స్యూరెన్స్ డబ్బు వచ్చింది. అయితే ఆ డబ్బు నాకు మాత్రమే వచ్చింది. ఆయన ఎందుకిలా చేశారు..? అని బీమా కట్టిన సంవత్సరాన్ని చూశా. తాతయ్య డబ్బు జమ చేయడం మొదలు పెట్టిన సమయంలో నేను నాలుగో తరగతి చదువుతున్నా. వీడు జీవితంలో ఎందుకూ పనికిరాడు. 18 ఏళ్ల వయసు వచ్చాక ఈ పది లక్షలు వాడికి ఏదో ఒక రూపంలో ఉపయోగపడతాయని ఆయన భావించి ఈ డబ్బు నా కోసమే జమ చేశారు. ఆయన దృష్టిలో ఎందుకూ పనికి రాని నేను.. ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను. అందుకు ఆనందిస్తున్నా. ఆయన కూడా నా ఎదుగుదలను చూసి ఉంటే బాగుండేది’’ అని అల్లు అర్జున్ తెలిపారు.
ఇక చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘అల్లు రామలింగయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి. ‘మనవూరి పాండవులు’ సినిమా వల్ల మేమిద్దరం మొదటిసారి కలిశాం. ఆయన్ని చూసినప్పుడు ‘ఈయనేంటి ఇంత సీరియస్గా ఉన్నారు’ అనుకున్నా. అదే రోజు షూటింగ్ పూర్తి కాగానే ‘‘బాబు నీ పేరేంటి? మీ ఊరు ఎక్కడ?’’ అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ రోజు నుంచి ఆయన దృష్టి నాపైనే ఎక్కువగా ఉండేది. కానీ, (సురేఖతో వివాహాన్ని ఉద్దేశిస్తూ) ఆ తర్వాతనే తెలిసింది ఆయన నన్నెందుకు అంతలా గమనించారో. ఆయనతోపాటు అరవింద్, ‘మనవూరి పాండవులు’ నిర్మాత జయకృష్ణ కూడా కలిశారు. నన్ను ఎలాగైనా సురేఖకు ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధమయ్యారు. ఓసారి జయకృష్ణ మా ఇంటికి వెళ్లి నాన్నతో మాట్లాడారు. దాంతో, మా నాన్న కూడా పెళ్లి చేసేయడానికి ఫిక్స్ అయ్యారు. బలివ్వడానికి గొర్రెను తీసుకువెళ్లినట్టు నన్ను పెళ్లికి సిద్ధం చేశారు. పెళ్లి చూపుల తర్వాత ఓసారి మామయ్య ఇంటికి రమ్మని పిలిస్తే వెళ్లాను.. మొదటిసారి సురేఖ పెట్టిన కాఫీ తాగాను. ఆ రోజు ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఓకే అని చెప్పాను. నా పెళ్లికి కూడా పెద్ద తతంగమే జరిగింది. వరుస షూటింగ్ల మధ్య మూడే రోజులు బ్రేక్ తీసుకొని పెళ్లి చేసుకున్నా. చిరిగిన షర్ట్తోనే సురేఖ మెడలో తాళి కట్టా. ఆ రోజు అల్లు రామలింగయ్య ముఖం ఆనందంతో వెలిగిపోయింది’’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్ను చూడలేదు: మాధవన్
అజయ్దేవ్గణ్తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్ను చూడలేదన్నారు. -
‘యానిమల్’.. ఎంజాయ్ చేశాను... అసహ్యించుకున్నాను : బాలీవుడ్ దర్శకుడు
‘యానిమల్’ (Animal)పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్. సినిమా గురించి ఒక్క మాటలో ఏం చెప్పాలో తనకు అర్థంకావడం లేదన్నారు. -
అందుకే అవార్డు వేడుకలకు హాజరుకాను: ఆమిర్ ఖాన్
సమయం చాలా విలువైనదని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ఖాన్ అన్నారు. తాజాగా కపిల్శర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన గత చిత్రాల ఫలితాల గురించి స్పందించారు. -
బర్త్డే వేడుకల్లో నాగ్ అశ్విన్ డ్యాన్స్.. వీడియో వైరల్
దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) పుట్టినరోజు వేడుకలు సరదాగా జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ చిత్రానికి సమంత రివ్యూ ఇచ్చారు. -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
‘మంజుమ్మల్ బాయ్స్’(Manjummel Boys)తో విజయాన్ని అందుకున్నారు నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ. తాజాగా వారిపై కేసు నమోదు అయ్యింది. -
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
విజయ్ (Vijay)తో సినిమాపై దర్శకుడు వెట్రిమారన్ (VetriMaaran) క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను ఆయనకు కథ చెప్పిన విషయం నిజమేనన్నారు. -
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
తనపై అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి నటి, బిగ్బాస్ 5 ఫేమ్ శ్వేతా వర్మ (Swetha Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తాజాగా కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
‘ఆదికేశవ’ నటి అపర్ణాదాస్, ‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడు దీపక్ పరంబోల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం