అతిథిగా నాగార్జున.. వంట చేసిన మెగాస్టార్‌ 

ప్రముఖ కథానాయకుడు అక్కినేని నాగార్జున నటించిన చిత్రం ‘వైల్డ్‌ డాగ్‌’. ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రచార కార్యక్రమాలతో...

Updated : 02 Apr 2021 06:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ కథానాయకుడు అక్కినేని నాగార్జున నటించిన చిత్రం ‘వైల్డ్‌ డాగ్‌’. ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రచార కార్యక్రమాలతో విరామం లేకుండా గడిపిన నాగార్జున.. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి ఇంటికి వెళ్లారు. దీంతో చిరంజీవి అతిథి నాగార్జున కోసం స్వయంగా ఓ కమ్మని వంట చేశాడు. దీనికి సంబంధించి నాగార్జున ట్విటర్‌లో చిరంజీవితో కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేశాడు.

‘‘వైల్డ్‌ డాగ్‌’ విడుదల నేపథ్యంలో నా ఒత్తిడి తగ్గించేందుకు మెగాస్టార్‌ స్వయంగా  వంటచేశారు. నాకోసం రుచికరమైన విందుని ఏర్పాటు చేశారు. ఈ సాయంత్రం అద్భుతంగా గడిచింది. ధన్యవాదాలు’’ అంటూ నాగార్జున ట్వీట్‌ చేశారు. ఈ దృశ్యాన్ని చిరంజీవి సతీమణి సురేఖ ఫొటో తీసినట్లు నాగార్జున తెలిపారు. 

మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సయామీఖేర్‌, అలీ రెజా, ఆర్యా పండిట్‌, కాలెబ్‌ మాథ్యూస్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని