Roja: కులం చూసి ఓట్లు వేసే సంస్కృతి పోవాలి: మంత్రి రోజా
కులం చూసి ఓట్లు వేసే సంస్కృతి పోవాలని ఏపీ మంత్రి రోజా అన్నారు.ప్రజల్లోనూ మార్పు వచ్చిందని, ప్రజల కోసం నాయకులు మారాలని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: కులం చూసి ఓట్లు వేసే సంస్కృతి పోవాలని ఏపీ మంత్రి రోజా అన్నారు. రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘శాసనసభ’ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రజల్లోనూ మార్పు వచ్చిందని, ప్రజల కోసం నాయకులు మారాలని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు.
‘‘మావాడు, మా కులం అని ఓట్లు వేసి, ఆ తర్వాత అతడు ఏమీ చేయలేదని బాధపడే కన్నా, మంచి వ్యక్తికి ఓటు వేసి గెలిపించుకుంటే వాళ్లకు మంచి జరుగుతుంది. కాబట్టి, కులం, మతం ప్రాంతాలను పక్కన పెట్టండి. మీ ప్రాంతంలో ఎవరు నిలబడ్డారు? వారిలో ఎవరు బెస్ట్, ఎవరికి ఓటు వేస్తే మంచి చేస్తారనేది ఆలోచించండి. ఓటు వేసిన దగ్గరి నుంచి మళ్లీ ఓటు వేయించుకునే వరకూ ఎమ్మెల్యేలు, ఎంపీలు గడప గడపకూ వెళ్లి ఏం ఇచ్చారో కనుక్కోవాలి. గెలిచిన ఐదేళ్లు ఏసీ రూముల్లో కూర్చొనే రోజులు పోయాయి. ఇప్పటికే మార్పు మొదలైంది. రాజకీయ నాయకుల్లో కూడా మార్పు రావాలి’’ అని రోజా అన్నారు.
‘‘ప్రతి వాడికి యుద్ధంలో గెలవాలని ఉంటుంది. కానీ, ఒక్కడే గెలుస్తాడు. వాడినే వీరుడు అంటారు’ అనే డైలాగ్ వినగానే జగన్మోహన్రెడ్డిగారే గుర్తొచ్చారు. రాజకీయాలు ప్రతిరోజూ యుద్ధంలాంటిది. ఆ యుద్ధంలో ప్రజల మనసును ఎవరు గెలుచుకుంటారో వాళ్లేకే శాసనసభలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. శాసనసభ అనగానే నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. ఇది ఫస్ట్ పాన్ ఇండియా పొలిటికల్ థ్రిల్లర్ మూవీ అని చెబుతున్నారు. పొలిటికల్ చిత్రాలకు సంభాషణలు చాలా ముఖ్యం. రాఘవేంద్రరెడ్డి చక్కని సంభాషణలు అందించారు. కేజీయఫ్లాంటి భారీ బడ్జెట్ చిత్రానికి సంగీతం అందించిన దర్శకుడు కొత్తవారిని ప్రోత్సహిద్దామనే ఉద్దేశంతో ఈ సినిమాకు అద్భుత సంగీతం అందించిన రవి బస్రూర్కు సెల్యూట్ చేస్తున్నా. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు