Tollywood: ఇద్దరు భామలతో...

ఈ చిత్రంలో ఆది సాయి కుమార్‌కి జోడీగా ఇద్దరు భామలు నటించనున్నారు. అందులో ఒకరిగా ఇప్పటికే దిగంగన సూర్యవంశీ ఖాయం కాగా, మరొక పాత్ర కోసం

Updated : 19 Mar 2022 09:09 IST

ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఫణికృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్‌ సమర్పకులు ఈ చిత్రంలో ఆది సాయి కుమార్‌కి జోడీగా ఇద్దరు భామలు నటించనున్నారు. అందులో ఒకరిగా ఇప్పటికే దిగంగన సూర్యవంశీ ఖాయం కాగా, మరొక పాత్ర కోసం మిర్నా మేనన్‌ని ఎంపిక చేసినట్టు చిత్రబృందం వెల్లడించింది. మలయాళం, తమిళంలో నటించి గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక మిర్నా. ఆమెకి ఇదే తొలి తెలుగు చిత్రం. ఇందులో ఇద్దరు కథానాయికలకీ ప్రాధాన్యం ఉంటుందని, త్వరలోనే సినిమా పేరుని ప్రకటిస్తామని వెల్లడించింది చిత్రబృందం. ఈ సినిమాకి సంగీతం: ఆర్‌.ఆర్‌.ధృవన్‌, ఛాయాగ్రహణం: సతీష్‌ ముత్యాల, కూర్పు: గిడుతూరి సత్య, కళ: కొలికపోగు రమేష్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని