Prabhas: జన సంద్రాన్ని తలపించిన మొగల్తూరు.. ప్రభాస్‌ అభివాదంతో ఫ్యాన్స్‌ ఖుషీ

దివంగత నటుడు కృష్ణంరాజు, ప్రభాస్‌ అభిమానులతో మొగల్తూరు జన సంద్రాన్ని తలపించింది. 

Updated : 29 Sep 2022 17:00 IST

మొగల్తూరు: దివంగత నటుడు కృష్ణంరాజు (Krishnam Raju) సంస్మరణ సభ సందర్భంగా మొగల్తూరు జన సంద్రాన్ని తలపించింది. ఇటీవల కన్నుమూసిన కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమాన్ని ప్రభాస్‌ సహా కుటుంబ సభ్యులు స్వగృహంలో గురువారం నిర్వహించారు. ప్రభాస్‌ వస్తున్నాడనే విషయం తెలియడంతో చుట్టు పక్కల గ్రామాల వారితోపాటు సుదూర ప్రాంతాలకు చెందిన అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

వీరిలో పలువురు ప్రభాస్‌ చూసేందుకు చెట్లపైన, ఎత్తైన భవంతులపైకెక్కారు. సెక్యూరిటీ దృష్ట్యా ప్రభాస్‌ తమ ఇంటిలో నుంచే అభిమానులకు అభివాదం చేసి, వారిలో ఉత్సాహం నింపారు. వచ్చిన ప్రతి ఒక్కరూ భోజనం చేసి వెళ్లాలని ప్రభాస్‌ కోరారు. సంబంధిత ఫొటోలు, వీడియోలతో నెట్టింట #PrabhasatMogalthuru హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో నిలిచింది. ఆ దృశ్యాలు మీరూ చూసేయండి...

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని