Mohanbabu: మితిమీరుతున్నారు జాగ్రత్త..! ఇకపై ఊరుకునేది లేదు..!

తమ కుటుంబంపై విపరీతంగా ట్రోల్స్‌ క్రియేట్‌ చేస్తోన్న యూట్యూబర్స్‌, సోషల్‌మీడియా యూజర్స్‌ను మంచు కుటుంబం హెచ్చరించింది. ఇంతకాలం సోషల్‌మీడియాలో తమపై ఎంత ట్రోలింగ్‌ వచ్చినా ఏం అనలేదని..

Updated : 20 Feb 2022 15:41 IST

ట్రోలర్స్‌కు మంచు కుటుంబం హెచ్చరిక

హైదరాబాద్‌: తమ కుటుంబంపై విపరీతంగా ట్రోల్స్‌ క్రియేట్‌ చేస్తోన్న యూట్యూబర్స్‌, సోషల్‌మీడియా యూజర్లను మంచు కుటుంబం హెచ్చరించింది. ఇంతకాలం సోషల్‌మీడియాలో తమపై ఎంత ట్రోలింగ్‌ చేసినా ఊరుకున్నామనీ.. కానీ, గత కొన్నిరోజులుగా నెగెటివ్‌ కామెంట్స్‌ మితిమీరుతున్నాయని పేర్కొంది. ఈ మేరకు మంచు కుటుంబానికి చెందిన ‘24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ ప్రొడక్షన్‌ హౌస్‌’ నుంచి పలువురు యూట్యూబర్స్, నెటిజన్లకు వ్యక్తిగతంగా మెయిల్స్‌ అందాయి.

‘‘తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా కొనసాగుతోన్న సినిమా టికెట్‌ ధరల వ్యవహారం నేపథ్యంలో సినీ ప్రముఖుల కోసం పనిచేస్తోన్న కొంతమంది వ్యక్తులు కావాలనే మంచు మోహన్‌బాబు, ఆయన తనయుడు విష్ణుపై నెగెటివ్‌ ట్రోల్స్‌ క్రియేట్‌ చేస్తున్నారని తెలిసింది. ఇప్పటివరకూ ఎలాంటి కామెంట్లు, పోస్టులు, ఫొటోలు షేర్‌ చేసినా ఎంతో నిగ్రహంగా ఉన్నాం. కానీ ఇప్పుడు యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టా వేదికగా పలువురు నెటిజన్లు చేసే ట్రోలింగ్‌ మితిమీరుతోంది. కాబట్టి, ఇప్పటివరకూ చేసిన అసభ్యకరమైన పోస్టులను వెంటనే తొలగించాలి. అలా చేయకపోతే.. మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ట్రోలింగ్స్‌ ఆపకపోతే రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేస్తాం ’’ అని హెచ్చరిస్తూ 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీకి చెందిన శేషు ప్రకటన విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని