MohanBabu: ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ వచ్చేస్తున్నాడు..!

చాలా సంవత్సరాల విరామం తర్వాత ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు సీనియర్‌ నటుడు మోహన్‌బాబు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’....

Published : 02 Feb 2022 10:35 IST

హైదరాబాద్‌: చాలా కాలం తర్వాత ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు సీనియర్‌ నటుడు మోహన్‌బాబు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ, శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మంచు విష్ణు నిర్మాత. ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశలో ఉన్న ఈ సినిమా విడుదల తేదీని బుధవారం ఉదయం ప్రకటించేశారు. ఫిబ్రవరి 18న థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చెప్పారు. దేశభక్తి నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈసినిమాలో మోహన్‌బాబు పవర్‌ఫుల్‌ రోల్‌ పోషించారు. ఆయన కోడలు, విష్ణు సతీమణి విరోనిక ఈ సినిమాలో మోహన్‌బాబుకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేశారు. ఇళయరాజా సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని