Mohan Babu: మోహన్‌బాబుతో పేర్నినాని భేటీ

ప్రముఖ నటుడు మోహన్‌బాబుతో ఏపీ సినిటోగ్రఫీ శాఖ మంత్రి సమావేశమయ్యారు.

Updated : 11 Feb 2022 15:09 IST

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు మోహన్‌బాబుతో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని సమావేశమయ్యారు. సినీ పరిశ్రమ సమస్యలపై గురువారం ఏపీలో జరిగిన భేటీపై ఇరువురి మధ్య చర్చ సాగుతున్నట్టు తెలుస్తోంది. చిత్ర పరిశ్రమలో నెలకొన్న అనేక సమస్యలను వివరించేందుకు చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్‌, రాజమౌళి, కొరటాల శివ తదితరులు సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. తమ ప్రతిపాదనలకు సీఎం సానుకూలంగా స్పందించారని, త్వరలోనే అన్నింటికీ పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు మోహన్‌బాబును పేర్నినాని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని