Mohanlal: సమ్మోహన నట శిఖరం
మోహన్లాల్.... సంపూర్ణ నటనకు అసలైన నిర్వచనం. అందుకే సినీలోకమంతా ఆయనను 'ది కంప్లీట్ మ్యాన్' అని పిలుచుకుంటుంది. నీరు ఏ పాత్రలో పోస్తే ఆ రూపంలోకి మారిపోయినట్లు...
సంపూర్ణ నటనకు అసలైన నిర్వచనం మోహన్లాల్. అందుకే సినీలోకమంతా ఆయనను ‘ది కంప్లీట్ మ్యాన్’ అని పిలుచుకుంటుంది. నీరు ఏ పాత్రలో పోస్తే ఆ రూపంలోకి మారిపోయినట్లు... సినిమాల్లో ఏ పాత్రనిచ్చినా అందులోకి ఒదిగిపోతారు. పాత్రలో జీవించి.. ప్రేక్షకులను తనలో లీనం చేసుకుంటారు. తన నటన చూసి చప్పట్లు కొట్టినవారు, కన్నీళ్లు పెట్టుకున్నవారే కాదు. ఆయన నటిస్తుంటే కట్ చెప్పడం మర్చిపోయి పారవశ్యం చెందిన దర్శకులూ ఉన్నారు. అంతలా ముగ్ధుల్ని చేస్తుంది ఆయన నటన. ఇవాళ ఆ సంపూర్ణ నటశిఖరం పుట్టినరోజు... ఈ సందర్భంగా మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం!
కుస్తీ నుంచి వెండితెరకు..
మోహన్లాల్ అసలు పేరు మోహన్లాల్ విశ్వనాథ్ నాయర్. రెండు సార్లు కుస్తీ పోటీల్లో ఛాంపియన్గా నిలిచిన లాలెట్టన్. ఆరో తరగతిలోనే నటనలోకి అడుగుపెట్టాడు. ఓ నాటకంలో 90 ఏళ్ల వృద్ధుడిగా నటించి అందరితోనూ ప్రశంసలు పొందాడు. స్నేహితులు తీసిన ‘తిరనోట్టమ్’ సినిమాలో మొదటిసారి నటించాడు. అయితే అది విడుదలకు నోచుకోలేదు. ఆ తర్వాత స్నేహితుల బలవంతం మీద ఆడిషన్కి వెళ్లి ‘మంజిల్ విరింజ పూక్కల్’లో విలన్ పాత్రకు ఎంపికయ్యాడు. అది సూపర్ హిట్టయి సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి బలమైన పునాది వేసింది. ఆ తర్వాత అంచెలంచెలుగా మలయాళ సినిమాను శాసించే స్థాయికి ఎదిగారు. ‘చిత్రం’, ‘కిరీడం’, ‘చంద్రలేఖ’, ‘నరసింహం’, ‘దృశ్యం’, ‘పులిమురుగున్’, ‘లూసిఫర్’ లాంటి ఎన్నో మరపురాని చిత్రాలను అందించి మలయాళ సినిమా మరో మెట్టెక్కించాడు.
వందకోట్ల క్లబ్ వీరుడు
‘పులిమురుగన్’తో వందకోట్ల వసూళ్ల మార్క్ను అందుకొని ఈ ఘనత సాధించిన తొలి మలయాళ చిత్రంగా నిలిపారు. ఆ తర్వాత వచ్చిన ‘లూసిఫర్’ రూ.200 కోట్లకు పైగా వసూళ్లను సాధించిపెట్టింది. ఈ వసూళ్లతో వందకోట్ల హీరో అయిపోయాడు మోహన్లాల్. యంగ్ హీరోలకూ సాధ్యం కానీ ఈ ఘనత సాధిస్తూ.. తనకింకా వయసైపోలేదని నిరూపిస్తున్నారు.
మల్టీ స్టారర్లలోనూ ముందే..
ప్రతి చిత్ర పరిశ్రమలో ఉండే అగ్ర కథానాయకులు మల్టీస్టారర్ సినిమాలు తీసేందుకు వెనకాడతారు. విజయ్, విశాల్, ఎన్టీఆర్, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి ఈతరం హీరోల సినిమాల్లో నటించేందుకు సంకోచించలేదు ఈ సూపర్స్టార్. జిల్లా, విలన్(2017), జనతా గ్యారేజ్ చిత్రాల్లో యువ హీరోలతో పోటీపడీ మరీ నటించారు.
పరభాషలోనూ...పాగా
కథలో దమ్ముండాలే కానీ, భాషతో సంబంధం లేకుండా సినిమాలు తీస్తారాయన. ‘ఇరువర్’తో తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆనందన్ పాత్రకు ప్రాణం పోశాడు. ఆర్జీవీ తీసిన ‘కంపెనీ’తో బాలీవుడ్కి వెళ్లిన ఆయన..‘ఆగ్’, ‘తేజ్’ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. కన్నడనాట ‘లవ్’లో ప్రత్యేక పాత్రలో మెరిశారాయన. తెలుగులో ‘జనతా గ్యారేజ్’ లాంటి హై వోల్టేజీ డ్రామాలో అంతే పవర్ఫుల్ పాత్రలో అదరగొట్టారు. ‘మనమంతా’ సినిమాతోనూ ఆకట్టుకున్నారు. ‘ఇరువుర్’ షూటింగ్ సమయంలో మోహన్లాల్ నటిస్తుంటే కట్ చెప్పడం మర్చిపోయేవారట ఆ సినిమా దర్శకుడు మణిరత్నం. ‘అతని నటన అంతగా సమ్మోహితుల్ని చేసింది. అలా ప్రతి సన్నివేశానికి చూస్తూ ఉండిపోతే సినిమా షూటింగ్ ఏం జరుగుతుంది చెప్పండి. అందుకే మోహన్లాల్తో షూటింగ్ చేయడం కష్టం’ అంటారు మణిరత్నం.
కార్ డ్రైవర్ను నిర్మాతగా మార్చి..
షూటింగ్ సమయంలో తాత్కాలిక డ్రైవర్గా పనిచేసేందుకు వచ్చిన ఆంటోని పెరంబవూర్ను కొంత కాలం తర్వాత నిర్మాతగా మార్చారు మోహన్లాల్. ఆయన మాలీవుడ్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. అయినా ఇప్పటికీ తాను మోహన్లాల్ డ్రైవర్ను అని చెప్పుకోవడానికే ఇష్టపడతానంటారు ఆంటోని. అతడితో స్నేహం చేయడమే కాదు, నిర్మాతగానూ మార్చడంతో లాలెట్టన్ మనసెంత విశాలమైందో ప్రపంచానికి తెలిసొచ్చింది.
అవార్డుల రారాజు..
మోహన్లాల్ ఇప్పటివరకూ మొత్తం 5 జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. ఉత్తమ నటుడిగా రెండు, స్పెషల్ జ్యూరీ అవార్డులు విభాగాల్లో రెండేసి విభాగాల్లో అవార్డు కైవసం కాగా, నిర్మాతగా ‘వానప్రస్థానం’ చిత్రానికి మరో అవార్డు వచ్చింది. 17 కేరళ రాష్ట్ర అవార్డులు, 11 ఫిలిం ఫేర్ అవార్డులు తన కైవసం అయ్యాయి. సినిమాకు చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్ అవార్డులతో సత్కరించింది. మరెన్నో అవార్డులు తన కిరీటంలో చేరాయి.
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’ ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?