ఓటీటీలో మంచు విష్ణు ‘మోసగాళ్లు’

దేశంలో జరిగిన అతిపెద్ద ఐటీ స్కామ్‌ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘మోసగాళ్లు’. మంచు విష్ణు హీరోగా ఈ సినిమాను డైరెక్టర్‌ జెఫ్రీ గీ చిన్‌ తెరకెక్కించారు. కాజల్‌, నవదీప్‌, నవీన్‌చంద్ర, సునీల్‌శెట్టి ప్రధానపాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా మార్చి 19న విడుదలై థియేటర్లలో ప్రేక్షకులను ఆట్టుకుంది.

Published : 16 Jun 2021 17:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో జరిగిన అతిపెద్ద ఐటీ స్కామ్‌ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘మోసగాళ్లు’. మంచు విష్ణు హీరోగా ఈ సినిమాను డైరెక్టర్‌ జెఫ్రీ గీ చిన్‌ తెరకెక్కించారు. కాజల్‌, నవదీప్‌, నవీన్‌చంద్ర, సునీల్‌శెట్టి ప్రధానపాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా మార్చి 19న విడుదలై థియేటర్లలో ప్రేక్షకులను ఆట్టుకుంది. ఇప్పుడు డిజిటల్‌ వేదికపై అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాలో మంచు విష్ణుకు సోదరిగా కాజల్‌ నటించింది. శ్యామ్‌ సీఎస్‌ సంగీతం అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని