Mrunal Thakur: ‘నా కథను అందరితో పంచుకుంటా..’ కన్నీళ్లతో ఉన్న ఫొటో షేర్‌ చేసిన మృణాల్‌

జీవితంలో తాను ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు చెప్పారు నటి మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur). ప్రస్తుతం ఆమె సంతోషంగా ఉన్నట్లు చెప్పారు.

Published : 22 Mar 2023 10:54 IST

ముంబయి: సోషల్‌మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు నటి మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur). తాజాగా ఆమె షేర్‌ చేసిన ఓ ఫొటో అభిమానులను కలవరపాటుకు గురి చేస్తోంది. ‘మేడమ్‌ మీకు ఏమైంది?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వరుస సినిమా షూట్స్‌తో బిజీగా ఉంటోన్న మృణాల్‌ (Mrunal Thakur) తాజాగా ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టారు. అందులో ఆమె కన్నీరు పెట్టుకుంటూ కనిపించారు. గతంలో తాను గడ్డు పరిస్థితులు చూశానని.. ఇప్పుడు సంతోషంగా ఉన్నానని చెప్పారు. ‘‘గడిచిన కాలం ఎన్నో కష్టాలతో సాగింది. కానీ, ఈరోజు ధైర్యం, సంతోషంగా ఉన్నా! ప్రతి ఒక్కరికీ ఒక కథ ఉంటుంది. కాకపోతే దాన్ని పైకి చెప్పడానికి ఆసక్తి చూపించరు. నేను అలా కాదు.. నా కథను ఈ ప్రపంచానికి వినిపించేలా చెబుతా. ఎందుకంటే, నా కథ నుంచి వేరొకరు పాఠాలు నేర్చుకుంటారని భావిస్తున్నా. కొన్నిసార్లు అవమానాలు ఎదురై బలహీనంగా మారినప్పటికీ.. వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలి’’ అని ఆమె పేర్కొన్నారు. ఈ పోస్ట్‌ చూసిన ఆమె అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఏమైందంటూ ప్రశ్నించారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘‘ఆ పోస్ట్‌లో నేను పెట్టిన ఫొటో.. ఇప్పటిది కాదు. మానసికంగా కుంగుబాటుకు గురైన సమయంలో దాన్ని తీసుకున్నా. ప్రస్తుతం నేను ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నా’’ అని అన్నారు.

గతేడాది విడుదలైన ‘సీతారామం’తో మృణాల్‌కు దక్షిణాదిలో మంచి గుర్తింపు లభించింది. అపురూప ప్రేమకావ్యంగా రూపుదిద్దుకున్న ఈసినిమాలో ఆమె రాణి పాత్రలో నటించారు. ఈ సినిమా సక్సెస్‌తో ఆమెకు నాని తదుపరి చిత్రంలో నటించే అవకాశం వరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని