MS Dhoni: చిత్ర పరిశ్రమలోకి ధోనీ.. తొలి చిత్రం దర్శకుడు ఎవరంటే?

సైన్స్‌ ఫిక్షన్‌, క్రైమ్‌ డ్రామా, కామెడీ.. ఇలా నేపథ్యం ఏదైనా ప్రేక్షకులకు మంచి కంటెంట్‌ అందించేందుకు ధోనీ సిద్ధమవుతున్నారు. ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై తెరకెక్కనున్న తొలి చిత్రాన్ని ప్రకటించారు.

Published : 25 Oct 2022 18:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ (Mahendra Singh Dhoni) సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నారు. తన సతీమణి సాక్షి సింగ్‌తో కలిసి ఆయన పలు భాషల్లో సినిమాలను నిర్మించనున్నారు. తమిళనాడుతో ధోనీకి ప్రత్యేక అనుబంధం ఉండటంతో తొలి సినిమాని తమిళంలో రూపొందిస్తున్నారు. అలా.. ‘ధోనీ ఎంటర్‌టైన్‌మైంట్‌’ నిర్మాణ సంస్థలో తెరకెక్కనున్న తొలి చిత్రానికి రమేశ్‌ తమిళ్‌మణి దర్శకత్వం వహించనున్నారు. సాక్షి సింగ్‌ కాన్సెప్ట్‌ అందిస్తున్న ఆ చిత్రం త్వరలోనే ప్రారంభంకానుంది. నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా వెల్లడించలేదు. ‘‘తమిళంలోనే కాకుండా ఇతర భాషల్లోనూ సినిమాలు నిర్మించనున్నాం. అన్ని చిత్ర పరిశ్రమల ఫిల్మ్‌ మేకర్స్‌తో కథా చర్చలు సాగిస్తున్నాం. సైన్స్‌ ఫిక్షన్‌, క్రైమ్‌ డ్రామా, సస్పెన్స్‌ థ్రిల్లర్‌, కామెడీ.. ఇలా నేపథ్యం ఏదైనా ప్రేక్షకులకు మంచి కంటెంట్‌ అందిస్తాం’’ అని ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ తెలిపింది. ‘అథర్వ: ది ఆరిజిన్‌’ అనే సైంటిఫిక్‌ ఫిక్షన్‌ వెబ్‌ సిరీస్‌లో ధోనీ నటించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌నూ రమేశే డైరెక్ట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని