Ab Dilli Dur Nahin: సినిమా కోసం అంబానీ ఫోన్.. ప్రాంక్ అనుకున్న చిత్ర బృందం!
Ab Dilli Dur Nahin: ఇటీవల విడుదలైన ‘అబ్ దిల్లీ దూర్ నహీ’ చిత్రాన్ని ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ప్రత్యేకంగా చూడాలనుకున్నారు. ఇదే విషయమై అంబానీ ఆఫీస్ నుంచి చిత్ర బృందానికి ఫోన్ చేస్తే వాళ్లు అస్సలు నమ్మలేదట. ఈ ఆసక్తికర విషయాలను కథానాయకుడు ఇమ్రాన్ జాహిద్ తాజాగా పంచుకున్నారు.
ఇంటర్నెట్డెస్క్: అనుకోకుండా కొత్త నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చి అవతలి వ్యక్తి ‘నేను ఫలానా హీరోను, బిజినెస్మ్యాన్ను’ అని మాట్లాడితే మొదట ఎవరూ నమ్మరు. ఎవరైనా ప్రాంక్ చేస్తున్నారేమో అనుకుంటారు. ‘అబ్ దిల్లీ దూర్ నహీ’ (Ab Dilli Dur Nahin) చిత్ర బృందానికి కూడా అదే పరిస్థితి ఎదురైంది. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి, ‘మా సర్ మీ సినిమాను యాంటీలియా(అంబానీ నివాసం) చూడాలనుకుంటున్నారు. స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తారా?’ అని అడిగితే, తాము మొదట నమ్మలేదని చిత్ర బృందం పేర్కొంది. అధికారిక మెయిల్ ఐడీ ద్వారా సమాచారం ఇస్తేనే స్పందిస్తామని చెప్పిందట. దీంతో ముకేశ్ అంబానీ ఆఫీస్ నుంచి ‘మా సీఎండీ ముకేశ్ అంబానీ కోసం మీరు తీసిన ‘అబ్ దిల్లీ దూర్ నహీ’ని ఆయన నివాసమైన యాంటీలియాలో ప్రదర్శించగలరు’ అని మెయిల్ రావడంతో చిత్ర బృందం ఆనందంతో ఉబ్బితబ్బిబైయిందట.
ఇటీవల జరిగిన ఈ ఆసక్తికర సంఘటనపై చిత్రంలో కీలక పాత్ర పోషించిన ఇమ్రాన్ జాహిద్ మాట్లాడుతూ.. ‘‘మా సినిమా వేల మందిలో స్ఫూర్తినింపడమే కాదు, ముఖేశ్ అంబానీలాంటి గొప్ప వ్యక్తులు చూడాలనిపించేలా ఉండటం మాకు దక్కిన గౌరవం.. అంతకన్నా ఎక్కువే. సినిమా స్క్రీనింగ్ కోసం ముఖేశ్ అంబానీ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే మేము ప్రాంక్ కాల్ అనుకున్నాం. అధికారికంగా మెయిల్ పెట్టమని అడిగాం. నిజంగానే మెయిల్ వచ్చింది. యాంటీలియాలో స్క్రీనింగ్ కావడం పట్ల మా సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి’’ అని చెప్పారు. ముంబయిలోని ముఖేశ్ అంబానీ నివాసంలో వారి కుటుంబం కోసం ప్రత్యేకంగా థియేటర్ ఉన్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా విషయానికొస్తే, బిహార్కు చెందిన గోవింద్ జైశ్వాల్ యువకుడి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఓ సామాన్య రిక్షా కార్మికుడి కుమారుడైన జైశ్వాల్ సివిల్ సర్వీసెస్ సాధించేందుకు పడిన కష్టాలను, జీవిత ప్రయాణాన్ని హృదయానికి హత్తుకునేలా కమల్ చంద్ర తెరకెక్కించారు. ఇమ్రాన్ జాహిద్, శ్రుతి సోడి కీలక పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా మే12 అతి తక్కువ థియేటర్లో విడుదలై మంచి టాక్ను సొంతం చేసుకుంది. ప్రముఖ దర్శక-నిర్మాత మహేశ్భట్ ఇందులో అతిథి పాత్ర పోషించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
నటి, గాయని స్మిత (Smita) నివాసంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. -
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan). -
నటీనటులకు రవాణా ఖర్చులు ఇవ్వకపోవడం బాధాకరం: మనోజ్ బాజ్పాయ్
‘సైలెన్స్ 2’ ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్పాయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
చిరంజీవిని కలిసిన రష్యన్ ప్రతినిధులు.. దేనిపై చర్చించారంటే..!
చిరంజీవిని రష్యన్ ప్రతినిధులు కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. -
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్లాల్ను కాంతార హీరో రిషబ్ శెట్టి కలిశారు. -
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు.
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
తిరుమలలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. 750 టెంకాయలు కొట్టిన నేతలు
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్