Tollywood: తెలుగు హీరోనా మజాకా.. ఇదేం క్రేజ్‌రా సామీ

సాధారణంగా ఓ సినిమా విడుదలయ్యాక దాన్ని ఆధారంగా చేసుకుని నటీనటులకు ప్రేక్షకుల్లో క్రేజ్‌ రావడం మనం చూస్తుంటాం. కానీ, సినిమా విడుదలకు ముంద....

Published : 02 Aug 2022 02:08 IST

హీరో ఎంట్రీ.. అంగుళం ఖాళీ లేకుండా నిండిపోయిన ముంబయి షాపింగ్‌మాల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: సాధారణంగా ఓ సినిమా విడుదలయ్యాక దాన్ని ఆధారంగా చేసుకొని నటీనటులకు ప్రేక్షకుల్లో క్రేజ్‌ రావడం మనం చూస్తుంటాం. కానీ, సినిమా విడుదలకు ముందే ఓ టాలీవుడ్‌ హీరోకు బాలీవుడ్‌ మార్కెట్‌లో ఉన్న క్రేజ్‌ చూస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ హీరోకు ముంబయిలోని ఫాలోయింగ్‌ చూసి నోరెళ్లబెడుతున్నారు. ఇంతకీ, ఆ హీరో ఎవరు? అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసేలా జరిగిన సంఘటన ఏమిటి?

‘అర్జున్‌రెడ్డి’తో సెన్సేషనల్‌ హీరోగా మారిపోయారు నటుడు విజయ్‌ దేవరకొండ. ఆ సినిమా తర్వాత నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఆయనకున్న క్రేజ్‌ వేరే లెవల్‌. ఆయన హీరోగా పాన్‌ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం ‘లైగర్‌’. పూరీ జగన్నాథ్‌ దర్శకుడు. ఆగస్టు 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘లైగర్‌’ టీమ్‌ ప్రమోషన్స్‌ ఆరంభించింది. ఇందులో భాగంగా విజయ్‌-అనన్య ఆదివారం సాయంత్రం ముంబయిలోని ఓ షాపింగ్‌మాల్‌కు వెళ్లారు. విజయ్‌ వస్తున్నాడని తెలుసుకొన్న అభిమానులు భారీగా అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆ వాణిజ్య సముదాయం అభిమానులతో నిండిపోయింది. అనుకున్నదానికంటే ఎక్కువమంది రావడంతో అభిమానుల మధ్య తోపులాట జరిగింది. కొంతమంది అమ్మాయిలు స్పృహ తప్పి పడిపోయారు. అభిమానుల్ని కంట్రోల్‌ చేయడం కోసం.. కార్యక్రమం ముగియకముందే విజయ్‌, అనన్యలను అక్కడి నుంచి పంపించేశారు. దీనికి సంబంధించిన విజువల్స్‌ ఇప్పుడు నెట్టింటిని షేక్‌ చేస్తున్నాయి. ఒక టాలీవుడ్‌ హీరోకి ముంబయిలో ఉన్న క్రేజ్‌ చూసి నెటిజన్లు.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఇదేం క్రేజ్‌’’ అంటూ పోస్టులు పెడుతున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని