Bangarraju: ‘మనం’ సమయంలో అనుకున్నది ‘బంగార్రాజు’తో కుదిరింది: అనూప్
సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఇంటర్వ్యూ. ‘బంగార్రాజు’ సినిమా గురించి ఆయన పంచుకున్న విశేషాలివీ...
ఇంటర్నెట్ డెస్క్: దర్శక-నటులు, నాయకానాయికలు కాంబినేషన్లకే కాదు నటుడు- సంగీత దర్శకుడు కాంబోకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంటుంది. వాటిల్లో అక్కినేని నాగార్జున- అనూప్ రూబెన్స్ కాంబినేషన్ ఒకటి. ‘మనం’, ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రాలతో అలరించిన వీరిద్దరూ త్వరలో ‘బంగార్రాజు’తో సందడి చేయనున్నారు. నాగార్జున హీరోగా కల్యాణ్కృష్ణ తెరకెక్కించిన చిత్రమిది. నాగ చైతన్య కీలక పాత్ర పోషించారు. రమ్యకృష్ణ, కృతిశెట్టి కథానాయికలు. ఈ సినిమా జనవరి 14న విడుదలవుతున్న నేపథ్యంలో అనూప్ రూబెన్స్ మీడియాతో మాట్లాడారు.
సీక్వెల్కు సంగీతమందించటం కష్టం అనిపించిందా?
అనూప్: సీక్వెల్కు సంబంధించి ఒత్తిడి ఉండటం సహజమే. తొలిభాగం ఘన విజయం అందుకోవటంతో సీక్వెల్పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరుగుతాయి. ఆ అంచనాల్ని అందుకోవాలంటే అంతకుమించి కష్టపడాల్సి ఉంటుంది. ‘బంగార్రాజు’ విషయంలోనూ అంతే. ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రం సూపర్ హిట్కావటంతో దాని సీక్వెల్ ‘బంగార్రాజు’ విషయంలో కాస్త ఒత్తిడి అనిపించింది. సంగీతం విషయంలోనే కాదు సీక్వెల్ అంటే అన్ని విభాగాలు చాలా కష్టపడాలి. నాగార్జునగారు, దర్శకుడు కల్యాణ్కృష్ణ ఈ సినిమా కోసం ఎంతో శ్రమించారు.
కొందరు సంగీత దర్శకులు కొంతమంది హీరోల చిత్రాలపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంటారనటంలో నిజముందా?
అనూప్: కాంబినేషన్ వల్ల ఇలా జరుగుతుంటుంది. ఏదైనా నిర్మాణ సంస్థను మాతృ సంస్థగా భావించటం కారణం కావొచ్చు. ఎందుకంటే ఆయా సంస్థలతో అప్పటికే పనిచేసి ఉంటాం కాబట్టి తదుపరి చిత్రాలకు పనిచేయడం తేలికవుతుంది. వారు మా నుంచి ఏం కోరుకుంటున్నారో ఇట్టే తెలిసిపోతుంది. దానికి తగ్గట్టు అవుట్పుట్ ఇస్తాం. అంతే తప్ప మరో కారణంలేదు. ఏ సినిమాకైనా మేం ఒకేలా కష్టపడతాం.
నాగార్జునతో మరోసారి కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?
అనూప్: నాగార్జునగారు స్నేహపూర్వకంగా ఉంటారు. నాకే కాదు ప్రతి సంగీత దర్శకుడికీ ఆయన పూర్తి స్వేచ్ఛనిస్తారు. ఆయన సినిమాలకు పనిచేసే సాంకేతిక నిపుణులందరి ఫీలింగ్ ఇదే. ఆయనంత ఫ్రీడమ్ ఇస్తారు కాబట్టి మా బాధ్యత పెరుగుతుంది. మంచి ఫలితం వచ్చేందుకు నిర్విరామంగా కృషి చేశాం.
* నాగార్జునతో పాట పాడించాలనే ఆలోచన ఎవరిది?
అనూప్: ‘మనం’ సినిమా చిత్రీకరణ సమయంలో.. ఆ సినిమాలోని ‘పీయో పీయో రే’ పాటను నాగ్ సర్ సరదాగా పాడారు. ఆయన గాత్రంలో ఆ పాట చాలా బాగుంది. ‘మీ వాయిస్ సూపర్ సర్. ఓ పాట పాడండి అని అడిగా’. అది ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రంతో సాధ్యమైంది. అందులో ‘డిక్కడిక్కడుండుం..’ అనే క్యాచీ గీతాన్ని ప్రయత్నించాం. ఆ పాటకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. అలాంటి గీతమే ‘బంగార్రాజు’లోనూ ఉంది. ‘లడ్డుండా’ అనే పాటను పాడి మరోసారి సందడి చేశారాయన.
* పాట పాడటం కష్టమేనా?
అనూప్: ఎవరు చేసే పని వారికి తేలిక. ఇతరుల పని చేయమంటే కష్టం. సంగీతం అందించే, పాటలు పాడే నన్ను నటించమంటే కష్టంగా ఫీలవుతా. వేరే పని చేసేవారిని పాట పాడమంటే కష్టమే మరి! కొంతమంది మాత్రం ఏదైనా చేయగలరు. విజయం అందుకోగలరు.
* ‘బంగార్రాజు’ ఆల్బమ్ అంచనాలు అందుకుందా?
అనూప్: ఇప్పటి వరకూ మూడు పాటలు విడుదల చేశాం. వాటిల్లో ‘లడ్డుండా’ ఎక్కువ మందికి చేరువైంది. అందరినీ మెప్పించింది. ‘నా కోసం’, ‘వాసివాడి తస్సాదియ్యా’కు మంచి స్పందన వస్తోంది. త్వరలోనే మరో పాటను విడుదల చేయబోతున్నాం.
* గతంలో అన్ని పాటలు ఒకేసారి విడుదలయ్యేవి. ప్రస్తుతం ఒక్కో పాటను విడుదల చేస్తున్నారు. ఈ విధానం సినిమాకు కలిసొస్తుందా?
అనూప్: ట్రెండ్కు తగ్గట్టు సినిమా ప్రచారం చేయటమే మంచిది. అప్పట్లో క్యాసెట్లు, సీడీల్లో పాటలు వినేవారు. ఇప్పుడు ఇంటర్నెట్ వేదికగా సంగీతాన్ని ఆస్వాదిస్తున్నారు. ఒక్కో పాటను ఒక్కో రోజు విడుదల చేయటం వల్ల సినిమాపై ఆసక్తి పెరుగుతుంది.
* సిధ్ శ్రీరామ్ గురించి చెప్తారా?
అనూప్: సిధ్ స్వరంలో ఏదో తెలియని మాయ ఉంటుంది. ఆయన.. భగవంతుడు మనకందించిన బహుమతి. తను ఏ పాట పాడినా అద్భుతంగా ఉంటుంది. స్వతహాగా నేను మెలొడీనే ఇష్టపడతా. అందుకే ఆయనతో అవే పాడిస్తుంటా. ‘నీలి నీలి ఆకాశం’ (30 రోజుల్లో ప్రేమించటం ఎలా?), ‘సోసోగా ఉన్న నన్నే’ (మంచి రోజులు వచ్చాయి) పాటలు అలా వచ్చినవే. ఇప్పుడు ‘నా కోసం’ (బంగార్రాజు) శ్రోతల్ని అలరిస్తోంది.
* మీరు బాణీ కట్టాలంటే ప్రేరేపించే అంశాలేంటి?
అనూప్: ముందుగా కథ. స్టోరీని ఇష్టపడితే ఆటోమేటిక్గా సందర్భానికి తగిన బాణీలు వస్తుంటాయి. ప్రయాణాల్లోనూ కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి. ఆ ట్యూన్ అలా చేస్తే బెటర్, ఇలా చేస్తే బాగుంటుందని మనసులో అనుకుంటా. తర్వాత దాన్ని ఆచరణలో పెడతా.
* ఈ సినిమా ఎలా ఉంటుందో చెప్తారా?
అనూప్: ఇది పల్లెటూరి నేపథ్యంలో సాగే కథ. ఈ సినిమాను చూస్తుంటే గ్రామీణ వాతావరణంలో ఉన్నట్టే అనిపిస్తుంది. కథకు తగ్గట్టే పాటలు, నేపథ్య సంగీతం అందించా. బీజీఎం (బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్) ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సినిమాకు రీ-రికార్డింగ్ ఎప్పుడో పూర్తయింది. ఇలాంటి పెద్ద చిత్రాలకు రీ రికార్డింగ్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. కానీ తక్కువ సమయంలోనే దీన్ని పూర్తి చేయగలిగాం. చిత్రీకరణ కూడా సుమారు నాలుగు నెలల్లోనే పూర్తయింది. సమష్టి కృషి వల్ల ఇంత త్వరగా విడుదలవుతుంది.
* దర్శకుడు కల్యాణ్కృష్ణలో మీరు చూసిన మార్పేంటి?
అనూప్: మా కాంబినేషన్లో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకు ఐదేళ్లు. టేకింగ్ విషయంలో ఆయనలో ఎంతో పరిణతి కనిపించింది. ఆయన రాసే సంభాషణలన్నీ హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి. కథ, డైరెక్షన్ విషయంలో చాలా స్పష్టత ఉంటుంది.
* కొవిడ్ వల్ల పని విధానంలో మార్పు గమనించారా?
అనూప్: కష్టపడేవారికి ఎక్కడున్నా ఒక్కటే. పరిస్థితులు ఎలా ఉన్నా, మనం ఎక్కడుంటున్నా పనిని ప్రేమించాలి. అయితే, లాక్డౌన్ వల్లే కుటుంబంతో గడిపే సమయం దొరికింది.
* తదుపరి సినిమాల విశేషాలు?
అనూప్: రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన ‘శేఖర్’కు సంగీతం అందించా. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా వుంది. ఈ చిత్రానికి నేపథ్య సంగీతం చాలా కీలకం. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాకు పనిచేస్తున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్. -
Sundeep Kishan: అలా చేసుంటే మీ సినిమా బ్లాక్బస్టర్ అయ్యేది: సందీప్ కిషన్తో అభిమాని
తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు హీరో సందీప్ కిషన్.
తాజా వార్తలు (Latest News)
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి