అటు డీఎస్పీ.. ఇటు ప్రదీప్‌

సినీ తారలు ఒకరినొకరు నామినేట్‌ చేసుకుంటూ... గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌, ప్రముఖ బుల్లితెర యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు మొక్కలు నాటారు.

Published : 28 Jul 2020 17:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ తారలు ఒకరినొకరు నామినేట్‌ చేసుకుంటూ... గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌, ప్రముఖ బుల్లితెర యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు మొక్కలు నాటారు. మైత్రీ మూవీస్‌ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్‌ ఇచ్చిన పిలుపుతో దేవిశ్రీప్రసాద్‌ మొక్కలు నాటగా, సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ నామినేట్‌ చేయడంతో ప్రదీప్‌ ఈ హరిత ఉద్యమంలో పాల్గొన్నారు. 

మొక్కలు నాటిన తర్వాత దేవిశ్రీప్రసాద్‌ తన వంతుగా ప్రముఖ కథానాయిక శ్రుతిహాసన్, ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్‌ను నామినేట్‌ చేశారు. తన తల్లి, మేనల్లుడుతో కలసి మొక్కలు నాటినట్లు దేవిశ్రీ ట్వీట్‌ చేశారు. మరోవైపు ప్రదీప్‌... ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, నటి ప్రియమణి, యువ కథానాయకుడు రామ్ పోతినేనికి హరిత సవాలు విసిరారు. మరి వీరు మొక్కలు నాటి ఎవరిని నామినేట్‌ చేస్తారో చూడాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని