Sarkaru Vaari Paata: థియేటర్లో ఫ్యాన్స్ డ్యాన్స్ వేయడం పక్కా: తమన్
మహేశ్బాబు(Mahesh babu) కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘సర్కారు వారి పాట’(sarkaru vaari paata).
మహేశ్బాబు (Mahesh babu) కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘సర్కారు వారి పాట’ (sarkaru vaari paata). కీర్తి సురేశ్ కథానాయిక. తమన్ సంగీత దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ విలేకరులతో మాట్లాడారు. ‘కళావతి’ సాంగ్, ‘సర్కారువారి పాట’ గురించి అనేక విషయాలను పంచుకున్నారిలా..
ఒకే సమయంలో వివిధ ప్రాజెక్టులు చేస్తూ అందరి అంచనాలను అందుకోవటం సాధ్యమేనా?
తమన్: చాలా కష్టం. ప్రస్తుతం వైవిధ్యమైన కథలతో సినిమాలు వస్తున్నాయి. దీంతో విభిన్నంగా ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాం. ‘సర్కారు వారి పాట’ (sarkaru vaari paata) పూర్తి కమర్షియల్ సినిమా. సినిమా మొత్తం స్పార్క్ తగ్గనే తగ్గదు. సినిమా అంతా షైనింగ్ కనిపిస్తూనే ఇదొక పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటర్ టైనర్.
లిరికల్ వీడియోకి కూడా భారీగా ఖర్చు పెట్టడంపై మీ అభిప్రాయం?
తమన్: ఆడియో కంపెనీలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. పాట బాగోలేకపోతే పెట్టుబడి పెట్టరు. అంతేకాదు, తగిన రాబడి వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటారు. 150 మిలియన్ వ్యూస్ సాధించడం అంత తేలిక విషయం కాదు. పాన్ ఇండియా సినిమాలే కాదు పాటలు కూడా అయిపోయాయి.
గతంలో ఏదైనా పాట హిట్ కావాలంటే కాస్త సమయం పట్టేది. ఇప్పుడు పరిస్థితి మారింది కదా!
తమన్: అవును. మంచి మ్యూజిక్ ఇవ్వడం ఒక ఎత్తయితే, అందరి అంచనాలను అందుకోవటం మరో ఎత్తు. దర్శకుడు, హీరో, ఫ్యాన్స్.. ఇలా అందరూ ఏదో ఒక సూచన చేస్తూనే ఉంటారు. దీంతో పాటు మిగతా భాషల పాటలతో కూడా పోటీ ఉంటుంది.
కళావతి పాట ఓకే అవ్వడానికి ఎన్ని వెర్షన్స్ చేశారు ?
తమన్: మేం ఎన్ని ట్యూన్స్ అయినా చేయడానికి రెడీ. అది కథకు సరిపొతుందా లేదా ? అనేది ముఖ్యం. దర్శకుడు ఎంతో కాలం కష్టపడి ఒక కథని రెడీ చేసుకుంటాడు. కథని లిరికల్గా చెప్పడానికి పాట కావాలి. ఇది చాలా పెద్ద బాధ్యత సర్కారు వారి పాటలో కళావతి పాట ఇలా కథలో నుంచి వచ్చిందే. దీనికి ఒకటే వెర్షన్ రాశారు. నేను, దర్శకుడు పరశురాం, గీత రచయిత అనంత శ్రీరామ్ జూమ్ కాల్లో మాట్లాడుతూ సినిమాలో హీరోయిన్ పేరుతో అనుకున్న ఫస్ట్ లైన్ పాటగా మారి ఇప్పుడు ఫాస్టెస్ట్గా 150 మిలియన్స్ వ్యూస్ క్రాస్ చేసింది.
సినిమాకు సంబంధించి మొదట ఏం పాట విడుదల చేయాలనే చర్చ ఉంటుందా ?
తమన్: కచ్చితంగా ఉంటుంది. మా సినిమానే కాకుండా ఆ సమయానికి బయట సినిమాల్లో ఎలాంటి పాటలు వస్తున్నాయనేది కూడా చూస్తాం. కళావతి పాట విడుదలకి ముందు డీజే టిల్లు, లాలా భీమ్లా నాయక్, బీస్ట్ పాటలు ట్రెండింగ్లో ఉన్నాయి. ఈ మూడు పాటలు కూడా లౌడ్ మాస్ సాంగ్స్. అలాంటి సమయంలో మెలోడీ సాంగ్ అయితే బెస్ట్ అని భావించి.. కళావతి (sarkaru vaari paata) పాట రిలీజ్ చేశాం. అలాగే, సితార వీడియోలు కొన్ని మహేశ్ గారి చూపించి .. పెన్నీ సాంగ్ సితారతోనే చేస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేశా. తర్వాత నమ్రతగారిని కలసి చెప్పా. ఓకే చెప్పారు. మేం పొద్దునుంచి చేస్తే సితార మూడు గంటల్లో సాంగ్ షూటింగ్ ఫినిష్ చేసింది. ఫైనల్ కట్ చూసిన మహేష్ గారు చాలా హ్యాపీగా ఫీలయ్యారు.
ఎంతో కష్టపడి చేసిన పాట లీక్ అవ్వడంతో ఎలా ఫీలయ్యారు ?
తమన్: కోపం రాలేదు గానీ చాలా బాధ అనిపించింది. కరోనాతో నిర్మాతలు కుదేలయ్యారు. ఇలాంటి సమయంలో ఇండస్ట్రీ బాగు కోరుకోవాలి కానీ ఇలాంటి పనులు ఎలా చేస్తారో అర్థం కాదు. లీకు ఎవరు చేశారో తెలిసింది. కానీ ఏం చేస్తాం.. మా నిర్మాతలు పెద్ద మనసున్న వ్యక్తులు. కెరీర్ నాశనం కాకూడదని వార్నింగ్ ఇచ్చి పంపాం.
‘అఖండ’ తర్వాత తమనే నేపథ్య సంగీతం చేయాలనే అభిప్రాయం వచ్చింది ? దీన్ని ఎలా చూస్తారు ?
తమన్: ఈ క్రెడిట్ బాలయ్య, బోయపాటికే దక్కుతుంది. సినిమాలో మేజిక్ లేకపోతే ఎంత మ్యూజిక్ చేసినా నిలబడదు. ‘అఖండ’లో ఆ పవర్ ఉంది.
‘సర్కారు వారి పాట’లో మీకు సవాల్ గా అనిపించిన పాట ?
తమన్: టైటిల్ సాంగ్కు ఎక్కువ కష్టపడ్డాం. అయితే ఫైనల్ గా అద్భుతమైన పాట వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్. -
Sundeep Kishan: అలా చేసుంటే మీ సినిమా బ్లాక్బస్టర్ అయ్యేది: సందీప్ కిషన్తో అభిమాని
తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు హీరో సందీప్ కిషన్.
తాజా వార్తలు (Latest News)
-
దావుద్ పార్టీలో డ్యాన్స్.. అక్షయ్కుమార్ సతీమణి ఏమన్నారంటే..?
-
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై మరో కేసు
-
200+ స్కోరు... చాలడం లేదు బాసూ!
-
తిరుమలలో వైభవంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!