మెగా కాంపౌండ్‌లో మ్యూజికల్‌ నైట్‌

అగ్రకథానాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవి నివాసంలో సంక్రాంతి పండుగ వేడుకలు గత రెండు రోజులుగా సందడిగా జరుగుతున్నాయి. బుధవారం ఉదయం ఇంటి ఆవరణలో భోగి మంటలతో ఈ వేడుకలను ప్రారంభించిన మెగా ఫ్యామిలీ..

Published : 16 Jan 2021 00:32 IST

సందడి చేసిన నాగార్జున

వైరల్‌గా మారిన ఫొటోలు

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి నివాసంలో సంక్రాంతి వేడుకలు గత రెండు రోజులుగా సందడిగా జరుగుతున్నాయి. బుధవారం ఉదయం ఇంటి ఆవరణలో భోగి మంటలతో ఈ వేడుకలను ప్రారంభించిన మెగా ఫ్యామిలీ.. దానికి సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ వేడుకల్లో చిరంజీవి, నాగబాబు కుటుంబాలతోపాటు ఉపాసన-చెర్రీ, బన్నీ ఫ్యామిలీ, సాయిధరమ్‌తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, సుస్మితా దంపతులు, శ్రీజ దంపతులు పాల్గొన్నారు. కొత్తగా వివాహబంధంలోకి అడుగుపెట్టిన నిహారిక-చైతన్య వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

కాగా, తాజాగా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం రాత్రి మెగా కాంపౌండ్‌లో మ్యూజికల్‌ నైట్‌ నిర్వహించారు. ఎంతో సందడిగా జరిగిన ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున సందడి చేశారు. కార్యక్రమం అనంతరం మెగా హీరోలతో నాగార్జున కలిసి దిగిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా మ్యూజికల్‌ నైట్‌లో భాగంగా చిరంజీవి చిన్నల్లుడు, నటుడు కల్యాణ్‌దేవ్‌ ‘యమహానగరి’ పాట పాడి అందర్నీ అలరించారు.

ఇదీ చదవండి

సలార్‌ షురూ




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని