Naga Chaitanya: ‘ఏ మాయ చేసావె’.. అదే నా ఫస్ట్‌ కిస్‌: నాగచైతన్య

నాగచైతన్య (Naga Chaitanya)-కృతిశెట్టి (Krithi Shetty) జంటగా నటించిన చిత్రం ‘కస్టడీ’ (Custody). వెంకట్‌ ప్రభు దర్శకుడు. మే 12న ఇది విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో చైతన్య ‘ఏ మాయ చేసావె’ సినిమా గురించి మాట్లాడారు.

Published : 08 May 2023 01:38 IST

హైదరాబాద్‌: ‘ఏ మాయ చేసావె’ (Ye Maaya Chesave).. నాగచైతన్య (Naga Chaitanya) కెరీర్‌లో సూపర్‌హిట్‌ చిత్రం. సుమారు 13 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా గురించి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ‘కస్టడీ’ (Custody) ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఫస్ట్‌ కిస్‌, ఫస్ట్‌ డేట్‌పై స్పందించమని విలేకరి కోరగా.. ‘ఏ మాయ చేసావె’ సినిమాలోనే తాను ఫస్ట్‌ టైమ్‌ ఆన్‌స్క్రీన్‌ కిస్‌ సీన్‌లో నటించానని చెప్పారు. ‘‘ఆరు లేదా ఏడో తరగతిలో ఉన్నప్పుడు ఫస్ట్‌ టైమ్‌ క్లాస్‌మేట్‌ని ఇష్టపడ్డాను. ఇంటర్‌లో ఉన్నప్పుడు ఫస్ట్‌ డేట్‌ కోసం కాఫీ షాప్‌కు వెళ్లాను. ఆన్‌స్క్రీన్‌ ఫస్ట్‌ కిస్‌ ‘ఏమాయ చేసావె’ సినిమాలో జరిగింది. ఆఫ్‌స్క్రీన్‌లో ఎప్పుడు అనేది చెప్పాలనుకోవడం లేదు. ఒక అమ్మాయిలో నేను మొదట గమనించేది.. ఆమె వ్యక్తిత్వాన్ని. అలాగే, నేను ఒంటరితనాన్ని కొన్నిసార్లు ఇష్టపడుతుంటాను. అలా ఉన్నప్పుడే మన గురించి మనకు మరిన్ని విషయాలు తెలుస్తాయి. మంచి ఆలోచనలు పుడతాయి. జీవితంలో మరింత బ్యాలెన్స్‌గా ఉండేందుకు అవి ఉపయోగపడతాయి’’ అని చై బదులిచ్చారు.

అనంతరం ఆయన నెపోటిజంపై మాట్లాడుతూ.. ‘‘ఈ విషయాన్ని ఎందుకు ఇంతలా చర్చిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మీరొక సినిమా పరిశ్రమకు చెందిన ఫ్యామిలీలో పుడితే.. ఇంట్లో వాళ్ల ప్రభావం మీపై ఎక్కువగా ఉంటుంది. అలా, మీరు కూడా సినిమాలపై ఆసక్తి కనబరుస్తారు. అందులో ఎలాంటి తప్పు లేదు. నేను పరిశ్రమలోకి సులభంగా అడుగుపెట్టి ఉండొచ్చు. కానీ, మైదానంలోకి అడుగుపెట్టాక బ్యాక్‌గ్రౌండ్‌ ఉందా? లేదా? అనేది ప్రేక్షకులు చూడరు. సినిమా బాగుంటేనే ప్రేక్షకులు ఓటేస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా పరిశ్రమలోకి అడుగుపెట్టి నిలదొక్కుకున్నవాళ్లంటే నాకెంతో గౌరవం ఉంది. అలాగే ఫిల్మ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పుడు తప్పకుండా మన ఫ్యామిలీలో ఉన్న హీరోలతోనే మనల్ని పోల్చి చూస్తుంటారు. నన్ను కూడా అలాగే పోలుస్తుంటారు. దాన్ని నేను తప్పుగా అనుకోను. ఒక సవాలుగా భావించి.. మరింత కష్టపడి వాళ్ల స్థాయికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటాను’’ అని ఆయన వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని