ఆహాలో ‘నాంది’: ట్రైలర్‌ చూశారా?

‘‘నా ప్రాణం పోయిన పర్వాలేదు.. న్యాయం గెలవాలి.. న్యాయమే గెలవాలి’’ అంటున్నారు

Published : 09 Mar 2021 19:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘‘నా ప్రాణం పోయిన పర్వాలేదు.. న్యాయం గెలవాలి.. న్యాయమే గెలవాలి’’ అంటున్నారు అల్లరి నరేశ్‌. ఆయన కీలక పాత్రలో విజయ్‌ కనకమేడల దర్శకత్వం వహించిన చిత్రం ‘నాంది’. వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్ర పోషించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

ముఖ్యంగా నరేశ్‌, వరలక్ష్మి నటన, విజయ్‌ కథ చెప్పిన తీరు విమర్శకులను సైతం మెప్పించింది. కాగా, మార్చి 12వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా ‘నాంది’ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించేలా సాగిన ట్రైలర్‌ను మీరూ చూసేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని