డ్రగ్స్‌ ఘటనలో నిహారికకు సంబంధం లేదు: నాగబాబు

పబ్‌లో డ్రగ్స్ ఘటనకు సంబంధించి తన కుమార్తె నిహారికకు ఎలాంటి సంబంధం లేదని నటుడు నాగబాబు

Published : 04 Apr 2022 01:16 IST

హైదరాబాద్‌: పబ్‌లో డ్రగ్స్ ఘటనకు సంబంధించి తన కుమార్తె నిహారికకు ఎలాంటి సంబంధం లేదని నటుడు నాగబాబు స్పష్టం చేశారు. దయచేసి అవాస్తవాలు ప్రచారం చేయవద్దని ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ‘‘గతరాత్రి రాడిసన్‌ బ్లూ పబ్‌లో జరిగిన సంఘటనపై నేను స్పందించటానికి కారణం నా కూతురు నిహారిక ఆ సమయానికి అక్కడ ఉండటమే. పబ్బు టైమింగ్స్‌ పరిమితికి మించి నడపటం వల్లపోలీసులు చర్యలు తీసుకున్నారు. నిహారికకు సంబంధించినంత వరకూ అంతా క్లియర్‌. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఎలాంటి తప్పు లేదని చెప్పారు. సోషల్‌, మెయిన్‌స్ట్రీమ్‌ మీడియాలో ఎలాంటి ఊహాగానాలకు తావు ఇవ్వకూడదని నేను మీ ముందుకు వచ్చాను. దయచేసి అవాస్తవాలు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నా’’అని వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని