నిహారిక-చైలకు కొవిడ్‌ టెస్ట్‌: నాగబాబు అప్‌డేట్‌

మెగా హీరోలు రామ్‌చరణ్‌, వరుణ్‌తేజ్‌లకు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ప్రస్తుతం వాళ్లిద్దరూ హోం క్వారంటైన్‌లో

Updated : 01 Jan 2021 04:21 IST

హైదరాబాద్‌: మెగా హీరోలు రామ్‌చరణ్‌, వరుణ్‌తేజ్‌లకు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ప్రస్తుతం వాళ్లిద్దరూ హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో అటు అభిమానులు ఇటు నెటిజన్లు అంతా ఇటీవల మెగా ఫ్యామిలీలో జరిగి క్రిస్మస్‌ వేడుకలపైనే చర్చించుకుంటున్నారు. ఈ వేడుకల్లో  ఆ కుటుంబానికి చెందిన యువ నటులంతా పాల్గొన్నారు. బుధవారం అల్లు శిరీష్‌ కొవిడ్‌ టెస్టు చేయించుకోగా, నెగెటివ్‌ వచ్చినట్లు తేలింది. ఈ నేపథ్యంలో నటుడు నాగబాబు తన కుమార్తె నిహారిక, అల్లుడు చైతన్యలకు సంబంధించి ఓ అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకున్నారు.

ఇటీవలే నిహారిక-చైతన్యలు విహారయాత్ర నిమిత్తం మాల్దీవులకు వెళ్లారు. దీనిపై నాగబాబు స్పందిస్తూ.. ‘నిహారిక-చైతన్యలు మాల్దీవులకు వెళ్లే ముందు కొవిడ్‌ టెస్టు చేయించుకున్నారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత వారిద్దరికీ ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి పరీక్షలు చేశారు. రెండుసార్లు నెగెటివ్‌ వచ్చింది’ అని ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని