naga chaitanya: మా ఇద్దరి కోసమే.. ఆ నిర్ణయం
‘ఇకపై నటుడిగా కొత్త ప్రయత్నాలు చేయాలనుకుంటున్నా’ అంటున్నారు కథానాయకుడు నాగచైతన్య. ప్రస్తుతం చిన్న.. పెద్ద సినిమా అన్న తేడాల్లేవని.. ప్రేక్షకులకు ఏ కథ కనెక్ట్ అయితే అదే పెద్ద చిత్రమని చెప్పారు. ఇప్పుడాయన తన తండ్రి నాగార్జునతో కలిసి నటించిన చిత్రం ‘బంగార్రాజు’. ‘సోగ్గాడే చిన్ని నాయనా’కు సీక్వెల్గా రూపొందింది.
‘ఇకపై నటుడిగా కొత్త ప్రయత్నాలు చేయాలనుకుంటున్నా’ అంటున్నారు కథానాయకుడు నాగచైతన్య. ప్రస్తుతం చిన్న.. పెద్ద సినిమా అన్న తేడాల్లేవని.. ప్రేక్షకులకు ఏ కథ కనెక్ట్ అయితే అదే పెద్ద చిత్రమని చెప్పారు. ఇప్పుడాయన తన తండ్రి నాగార్జునతో కలిసి నటించిన చిత్రం ‘బంగార్రాజు’. ‘సోగ్గాడే చిన్ని నాయనా’కు సీక్వెల్గా రూపొందింది. కల్యాణ్ కృష్ణ తెరకెక్కించారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు చైతన్య.
తొలిసారి సంక్రాంతికి వస్తున్నట్లున్నారు కదా.. ఒత్తిడిగా ఉందా?
‘‘ఉంది.. అదే సమయంలో ఆనందంగానూ ఉంది. ఇది నా తొలి సంక్రాంతి చిత్రమే కాదు.. నేను చేసిన తొలి సీక్వెల్ కూడా. సంక్రాంతి లక్ష్యంతోనే తెరకెక్కించిన చిత్రమిది. వేసవికి ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురానని నాన్న చెబుతుండేవారు. అందుకే సినిమా ప్రారంభించినప్పటి నుంచి పండక్కి అందుకునేందుకు చకచకా చిత్రీకరణను పరుగులు పెట్టించారు. ఒకే షెడ్యూల్లో షూట్ పూర్తి చేశాం. మేమనుకున్నట్లుగా సంక్రాంతికే చిత్రాన్ని తీసుకొచ్చాం’’.
‘బంగార్రాజు’ పాత్రకి ప్రేక్షకుల్లో ఓ ఇమేజ్ ఉంది. ఈ పాత్ర మీరు చేయాలన్నప్పుడు ఎలా ఫీలయ్యారు?
‘‘చాలా భయమనిపించింది. ఎందుకంటే ‘సోగ్గాడు..’ చిత్రంతో అందరిలో మంచి అంచనాలు ఏర్పడిపోయాయి. ఇక సీక్వెల్ అన్నప్పుడు అంచనాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. అందుకే ఈ సినిమా షూట్కు ముందు నాన్నని, దర్శకుడు కల్యాణ్ని పాత్ర విషయమై చాలా డౌట్స్ అడిగాను. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాని అనేక సార్లు చూసుకుని.. ఆ పాత్రని సొంతం చేసుకునే ప్రయత్నం చేశాను. సెట్లోకి వెళ్లాక పాత్ర విషయంలో నాన్న, కల్యాణ్ చాలా సహాయం చేశారు’’.
ఈ చిత్రంలో చాలా మంది కథానాయికల్ని పెట్టినట్లున్నారు కదా..?
‘‘చాలా మంది నాయికలున్నా.. వాళ్లు పాటల్లోనే కనిపిస్తారు. సినిమా మొత్తానికి ఏకైక కథానాయిక కృతి శెట్టినే. పండక్కి వచ్చే చిత్రం కదా.. ఇలాంటి మెరుపులన్నీ సినిమాలో ఉండాలి. లాజిక్కులన్నీ పక్కకు పెట్టేసి ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలి. నేనిప్పటి వరకు చేసిన రొమాంటిక్ చిత్రాలన్నీ కాస్త రియలిస్టిక్గా ఉండేవి. ఈ చిత్రంలో రొమాన్స్లో ఎంటర్టైన్మెంట్ కలిసి ఉంటుంది. ఇందులో నాగలక్ష్మీ అనే పాత్రలో కృతి కనిపిస్తుంది. ఊరి సర్పంచ్ తను. ఇందులో నేనెంత అల్లరి చేస్తానో.. తను అంతే అల్లరి చేస్తుంది. ద్వితీయార్థానికి వచ్చే సరికి ఇద్దరి మధ్య ఓ నిజాయితీతో కూడిన ప్రేమకథ మొదలవుతుంది’’.
ఏపీలో ఉన్న టికెట్ రేట్ల వల్ల ఈ చిత్రానికి ఇబ్బంది ఉందనుకుంటున్నారా?
‘‘ఈ టికెట్ రేట్ల విషయంలో నేను నాన్నతో చాలా సార్లు చర్చించా. ఈ టికెట్ రేట్ల జీవోని ఏప్రిల్లో విడుదల చేశారు. అందుకే మేమీ చిత్రం అనుకున్నప్పుడు అందులోని టికెట్ రేట్లకు అనుగుణంగానే బడ్జెట్ వేసుకున్నాం. దానికి తగ్గట్లుగానే సినిమాని ముందుకు తీసుకెళ్లాం. కాబట్టి సమస్య ఏమీ లేదు. ఒకవేళ మునుపటి ధరలు ఉండి ఉంటే మాకది బోనస్ అయ్యి ఉండేది’’.
మీ మిగతా చిత్రాలకి ఈ టికెట్ ధరలు ఇబ్బంది కాదంటారా?
‘‘థ్యాంక్ యూ’ విషయంలో నిర్మాత దిల్రాజు చూసుకుంటారు. నేను నటుడ్ని మాత్రమే. సినిమా ప్రారంభించేటప్పుడు నిర్మాతకు ఏదైనా ఇబ్బంది ఉందనిపిస్తే.. నావైపు నుంచి నేనేమన్నా చేయగలనా? అని ఆయన్ని అడుగుతా. నా పని నేను చేసుకువెళ్తా’’.
కథ ఎలా ఉంటుంది? ఇద్దరు బంగార్రాజుల పాత్రలెలా ఉంటాయి?
‘‘నేనిందులో పెద్ద బంగార్రాజు మనవడు చిన్న బంగార్రాజుగా కనిపిస్తా. ఇది నాకు సవాల్గా అనిపించింది. పోలికలు.. లక్షణాల విషయంలో తాతకు తగ్గ మనవడిలా ఉంటా. అల్లరి విషయంలో మాత్రం పెద్ద బంగార్రాజును మించేలా ఉంటా. ఆ అల్లరిని అదుపులో పెట్టడానికే పెద్ద బంగార్రాజు కిందకి వస్తారు. అలాగే ఊరి గుడికి సంబంధించిన మరో సమస్య కథలో ఉంటుంది. వీటన్నిటితో కథెలా ముందుకు సాగింది? అన్నది తెరపై చూడాలి. సినిమాలో నాకు, మా నాన్నకు ఇద్దరికీ సమాన ప్రాధాన్యముంటుంది. నా పాత్ర కంటే ఆయన పాత్రే ఓ మెట్టు ఎక్కువగా ఉంటుంది. కథ మొత్తం పెద్ద బంగార్రాజు, రమ్యకృష్ణ నడిపిస్తారు. ఈ చిత్రం ఆద్యంతం చాలా వినోదాత్మకంగా ఉంటుంది. సినిమా ఆరంభంలో ఓ చిన్న సునామీ ఎపిసోడ్ ఉంటుంది. దాన్ని మినీయేచర్స్తో తీశారు. అదీ ప్రేక్షకులకు చాలా నచ్చుతుంది’’.
‘మనం’ తర్వాత నాన్నతో కలిసి నటించిన చిత్రమిదే. ఎలా అనిపించింది?
‘‘మనం’ సమయంలో నాన్న, తాత ఏయన్నార్లతో కలిసి చేసేటప్పుడు కాస్త టెన్షన్ ఉండేది. కెమెరా ముందు యాక్షన్ అన్నప్పుడు ఎదురుగా నాన్న ఉన్నారన్న ఒత్తిడి ఉండేది. ‘బంగార్రాజు’కు వచ్చేటప్పటికి ఆ భయం పోయింది. ఇద్దరం చాలా ఓపెన్ అయిపోయి చేసేశాం. ఈ చిత్రంలో మా ఇద్దరి కెమిస్ట్రీ బాగా వర్కవుటయ్యింది అనుకుంటున్నా’’.
కొత్త సినిమా విశేషాలేంటి?
‘‘ప్రస్తుతం ‘థ్యాంక్ యూ’ సినిమా చేస్తున్నా. తుది దశ చిత్రీకరణలో ఉంది. ఇందులో నేను మూడు విభిన్నమైన గెటప్పుల్లో కనిపిస్తా. అమిర్ ఖాన్తో చేసిన ‘లాల్ సింగ్ చద్దా’ వేసవిలో విడుదలవుతుంది. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో అమెజాన్ ప్రైమ్ కోసం ఓ వెబ్ సిరీస్ చేస్తున్నా. ఆసక్తికరమైన మంచి హారర్ డ్రామా కథాంశంతో తెరకెక్కుతుంది. పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది’’.
ఇటీవల మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవల్సి వచ్చింది. వాటిని ఎలా అధిగమించారు?
‘‘ఆ సమయంలో కుటుంబమంతా అండగా నిలిచింది. ఇద్దరి మంచి కోసం తీసుకున్న నిర్ణయమది. తను హ్యాపీ. నేనూ సంతోషంగా ఉన్నా. కెరీర్ పరంగా ఇద్దరం హ్యాపీనే’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాళ్ల పార్టీలకు వెళ్లకపోవడం వల్లే మంచి అవకాశాలు రాలేదు: పరిణీతి చోప్రా
తన పీఆర్ కారణంగా ఎన్నో అవకాశాలు కోల్పోయినట్లు నటి పరిణీతి చోప్రా చెప్పారు. -
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
నటుడు రామ్చరణ్ (Ram Charan) సతీమణి ఉపాసన (Upasana) తాజాగా ఓ సరదా వీడియో షేర్ చేశారు. ఇందులో సురేఖ (చిరంజీవి సతీమణి) ఆవకాయ పడుతూ కనిపించారు. -
కెమెరాకు సైతం అందని ఎన్టీఆర్ పరుగు.. పులితో ఛేజింగ్ సీక్వెన్స్ ఇలా..
ఎన్టీఆర్ పరిచయ సన్నివేశంలో పులితో ఛేజింగ్ చేసే సీన్ ఎలా తీశారో ‘ఆర్ఆర్ఆర్’ కెమెరామెన్ సెంథిల్కుమార్ ఇటీవల పంచుకున్నారు. -
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నటి సోనాలి మాట్లాడుతూ.. తాను నటించిన ఓ సినిమా నుంచి గుణపాఠాన్ని నేర్చుకున్నట్లు చెప్పారు. -
ఆ ప్రాజెక్ట్ వదులుకున్నా.. దీపిక నాకు థ్యాంక్స్ చెప్పాలి: కరీనాకపూర్
బాలీవుడ్ నటి కరీనాకపూర్ (Kareena Kapoor) తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తానొక హిట్ ప్రాజెక్ట్ వదులుకున్నానని.. దాంతో ఆ అవకాశం దీపికను వరించిందని తెలిపారు. -
‘మా చిత్రాన్ని మరో ‘అన్బే శివం’ చేయొద్దు’: విజయ్ ఆంటోనీ వైరల్ పోస్ట్
విజయ్ ఆంటోనీ (Vijay Antony) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘రోమియో’ (Romeo). ఇదే చిత్రాన్ని తెలుగులో ‘లవ్గురు’గా విడుదల చేశారు. -
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
నటి, గాయని స్మిత (Smita) నివాసంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. -
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
అభినవ్ గోమఠం, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా రివ్యూ మీ కోసం.. -
మనసంతా.. ఫాంటసీ
చిత్ర పరిశ్రమలో సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే కొత్త ప్రపంచాలు.. -
‘విక్రమార్కుడు2’ కోసం కథ సిద్ధమైంది
‘‘తెలుగులో ‘విక్రమార్కుడు 2’, హిందీలో ‘రౌడీ రాథోడ్ 2’ చిత్రాల కోసం కథ సిద్ధమైంది. నటుల ఎంపిక పూర్తవ్వగానే సినిమాని పట్టాలెక్కిస్తాం’’ -
గురుశిష్యులుగా తండ్రీకూతుళ్లు?
సినిమాల్లో నటనతో మెప్పించే కథానాయకులు.. వారి వారసులను తెరపైకి ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా? అనే ఆసక్తితో ఎదురుచూస్తుంటారు సినీప్రియులు. -
ఈ వేసవిలో... ‘మనమే’
‘చాలా మంచోడిగా కనిపిస్తా, కానీ మంచోడినా? కాదు’ అని చెప్పుకునే ఓ అబ్బాయి. ‘ఒకరికి మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటమే మన క్యారెక్టర్’ అని నమ్మే ఓ అమ్మాయి. -
నిర్ణయించుకో.. నిన్నెవరు పాలించాలో!
‘రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే... మీ ఆస్తులు మాత్రం ఎలా పెరుగుతున్నాయి సర్?’ అంటూ సూటిగా ప్రశ్నించాడు ఓ పాత్రికేయుడు. మరి సదరు నాయకుడి సమాధానం ఏమిటో తెలియాలంటే ‘ప్రతినిధి2’ చూడాల్సిందే. -
రెట్టింపు నవ్వులతో... ‘మ్యాడ్ స్క్వేర్’
‘టిల్లు స్క్వేర్’తో విజయాన్ని సొంతం చేసుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ... మరో కొనసాగింపు చిత్రాన్ని పట్టాలెక్కించింది. -
బేబి కీర్తి.. సెట్లో సందడి
ఇతర భాషల్లో నటించి మంచి క్రేజ్ని సొంతం చేసుకున్న నాయకానాయికలు ఎందరో. ఇప్పుడదే జాబితలో చేరింది అందాల కథానాయిక కీర్తి సురేశ్. ‘బేబి జాన్’తో ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. -
‘బాక్’.. వారం వెనక్కి
సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్’. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. -
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan).
తాజా వార్తలు (Latest News)
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?