సమంత బాటలోనే నాగచైతన్య?
నాగచైతన్య - విక్రమ్ కె.కుమార్ కలయికలో ‘థ్యాంక్యూ’ పేరుతో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి
హైదరాబాద్: నాగచైతన్య - విక్రమ్ కె.కుమార్ కలయికలో ‘థ్యాంక్యూ’ పేరుతో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెట్స్పై ఉన్న ఈ సినిమా పూర్తయ్యాక, మరోసారి ఈ ఇద్దరూ కలిసి పనిచేయనున్నట్టు సమాచారం. అయితే ఈసారి వెబ్సిరీస్ కోసమని తెలుస్తోంది. నాగచైతన్యతో ఓ ప్రముఖ ఓటీటీ వేదిక వెబ్ సిరీస్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం.
థ్రిల్లర్ కథతో రూపొందనున్న ఆ సిరీస్కి విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించే అవకాశాలున్నట్టు తెలిసింది. సమంత ఇప్పటికే ‘ది ఫ్యామిలీ మేన్2’ సిరీస్లో నటించిన సంగతి తెలిసిందే. తన భార్యలాగే నాగచైతన్య కూడా ఓటీటీ వేదికతో ఇంటింటికీ చేరువ కానున్నారన్నమాట.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!