Naga Chaitanya: చైతూతో రష్మిక... కొత్త జోడీ కుదిరిందా?
నాగచైతన్య కథానాయకుడిగా పరుశురామ్ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా,
హైదరాబాద్: నాగచైతన్య కథానాయకుడిగా పరుశురామ్ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా, త్వరలోనే సెట్స్పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ఈ చిత్రంలో కథానాయిక కోసం అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో రష్మిక పేరు బలంగా వినిపిస్తోంది. అయితే, రష్మికకు పరుశురామ్ కథ వినిపించారా? లేదా? అన్నది స్పష్టత లేదు. గతంలో పరుశురామ్ దర్శకత్వంలో వచ్చిన ‘గీతగోవిందం’లో రష్మిక సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాగచైతన్య పక్కన రష్మిక ఓకే అయితే, తొలిసారి వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం ఇదే అవుతుంది. ఈ కొత్త జంటపై స్పష్టత రావాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ప్రస్తుతం చైతు ‘లాల్ సింగ్ చడ్డా’ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. ఆమిర్ఖాన్తో కీలక పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. అమెరికన్ క్లాసిక్ ‘ఫారెస్ట్గంప్’కు రీమేక్గా ఇది రూపొందింది. మరోవైపు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘దూత’ అనే వెబ్సిరీస్లో చైతూ నటిస్తున్నారు. పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే