Naga Chaitanya: అలా చేస్తే మనల్ని మనం కించపరుచుకున్నట్లే.. : నాగచైతన్య

'వీరసింహారెడ్డి' విజయోత్సవ సభలో  బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై  అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya), అఖిల్(Akhil) ట్వీట్స్‌ చేశారు.

Updated : 24 Jan 2023 14:01 IST

హైదరాబాద్‌: బాలకృష్ణ(Balakrishna) హీరోగా నటించిన తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’(Veera Simha Reddy). ఈ చిత్రం హిట్‌ టాక్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విజయోత్సవ సభలో హీరో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు నెట్టింట చర్చకు దారితీశాయి. తాజాగా ఈ వ్యాఖ్యలపై అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya), అఖిల్(Akhil) ట్వీట్లు చేశారు.‘‘నందమూరి తారక రామారావుగారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్‌.వి రంగారావు గారు.. వీరంతా తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు. వారిని అగౌరవపరచడమంటే మనల్ని మనమే కించపరుచుకోవడం..’’ అని నాగచైతన్య, అఖిల్‌ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్లు వైరల్‌ అవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని