Naga Chaitanya: నాగ చైతన్య కొత్త ప్రయాణం.. ‘దూత’ ప్రారంభం

ఓటీటీకి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ సినీ నటులూ వెబ్‌ సిరీస్‌ల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Published : 02 Mar 2022 01:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓటీటీకి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ సినీ నటులు వెబ్‌ సిరీస్‌ల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు తారలు వెబ్‌ సిరీస్‌ల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించారు. తాజాగా ఈ జాబితాలోకి నాగ చైతన్య చేరబోతున్నారు. ‘దూత’ అనే వెబ్‌ సిరీస్‌లో ఆయన నటిస్తున్నారు. చిత్రీకరణ మంగవాళం ప్రారంభమైందని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు ఓ ఆసక్తికర ఫొటోను పోస్ట్‌ చేశారు. ఈ సిరీస్‌కు విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకుడు. థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే ఈ సిరీస్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. విక్రమ్‌ కె.కుమార్‌- నాగ చైతన్య కాంబినేషన్‌లో రూపొందిన ‘థ్యాంక్‌ యు’ చిత్రం త్వరలోనే విడుదలకానుంది. ఇదే కాంబినేషన్‌లో ‘మనం’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అక్కినేని హీరోలంతా కలిసి నటించిన ఆ సినిమా దర్శకుడిగా విక్రమ్‌కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని