SSMB 28: ఆ హీరోయిన్స్‌కు ఒకటి, రెండు అని మేము నంబర్స్‌ ఇవ్వలేదు

మహేశ్‌బాబు (MaheshBabu) - త్రివిక్రమ్‌ (Trivikram) కాంబినేషన్‌లో ఓ సినిమా సిద్ధం కానున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత నాగవంశీ ఈ ప్రాజెక్ట్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published : 15 Jan 2023 14:59 IST

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు (Mahesh Babu) తదుపరి సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నిర్మాత సూర్య దేవర నాగవంశీ. త్వరలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలిపారు. అలాగే ఈ ఏడాదిలోనే దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చెప్పారు. అయితే ఈ సినిమాలో శ్రీలీల సెకండ్‌ హీరోయిన్‌గా నటించనుందంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన కాస్త అసహనం వ్యక్తం చేశారు. సెకండ్‌ హీరోయిన్‌ అంటే ఏమిటి? వీళ్లు ఫస్ట్‌, వాళ్లు సెకండ్‌ అంటూ మేము ఏ హీరోయిన్‌కీ నంబర్స్‌ ఇవ్వలేదు.. అని ఆయన వ్యాఖ్యలు చేశారు.

‘‘త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా మా బ్యానర్‌పై ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. జనవరి 18 నుంచి ఈసినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఆగస్టు 11న ఈచిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. ఇందులో పూజాహెగ్డే, శ్రీలీల ఇద్దరూ హీరోయిన్సే. ఒకరు ఫస్ట్‌ మరొకరు సెకండ్‌ అని కాదు. వాళ్లిద్దరూ మహేశ్‌ పక్కన హీరోయిన్స్‌గా నటించనున్నారు. అయితే, మేమింకా శ్రీలీలను హీరోయిన్‌గా ప్రకటించక ముందే SSMB 28లో ఆమె సెకండ్ హీరోయిన్‌గా కనిపించనుందంటూ ట్విటర్‌, ఇన్‌స్టాలో వరుస మీమ్స్‌ వస్తున్నాయి. అసలు సెకండ్‌ లీడ్‌ అంటే ఏమిటి? దీనిని ఎవరైన డిజైన్‌ చేశారా? వీళ్లు ఫస్ట్‌, వీళ్లు సెకండ్‌.. అంటూ మేము ఎవరికీ నంబర్లు ఇవ్వలేదు’’ అని నాగవంశీ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని