Nagababu: ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నా: నాగబాబు

తన జీవితంలో ఇప్పటివరకూ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నానని నటుడు, జనసేన నేత నాగబాబు అన్నారు. ఓవైపు పలు చిత్రాల్లో సహాయ నటుడిగా నటిస్తూనే, మరోవైపు బుల్లితెర కార్యక్రమాలతోనూ ఆయన అలరిస్తున్నారు....

Updated : 13 Mar 2022 11:35 IST

నటుడి పోస్ట్‌ వైరల్‌..

హైదరాబాద్‌: తన జీవితంలో ఇప్పటివరకూ ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నానని నటుడు నాగబాబు అన్నారు. ఓవైపు పలు చిత్రాల్లో సహాయ నటుడిగా నటిస్తూనే, మరోవైపు బుల్లితెర కార్యక్రమాలతోనూ ఆయన అలరిస్తున్నారు. ఏ కాస్త సమయం దొరికినా సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో మమేకమయ్యే ఆయన.. తాజాగా పెట్టిన ఓ పోస్ట్‌ వైరల్‌గా మారింది. ‘‘ఈ బాటసారి ప్రయాణం కొనసాగుతుంది..’’ అంటూ శనివారం సాయంత్రం తన సోషల్‌మీడియా ఖాతాల్లో ఓ పోస్ట్ పెట్టారు.

‘‘ఇన్నేళ్ల నా జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు, మరెన్నో విపత్తులను ఎదుర్కొని నన్ను నేనుగా మార్చుకోగలిగాను. ఒక రకంగా చూస్తే ఈ ఆపదలు, కష్టాలే నన్ను ఒక పూర్తి మనిషిగా మలచడానికి ఎంతగానో సహాయపడ్డాయి..! నేను పుట్టి పెరిగిన నా దేశానికి, తోటిప్రజలకు సహాయపడాలని నిర్ణయించుకొని అదే గమ్యంగా లక్ష్యం వైపు పయనించాను. ఈ పయనంలో ఒడుదొడుకులు, ఆటంకాలు ఎదురైనా.. నన్ను ప్రతిసారీ వెన్నంటి నడిపించి నాకు మనిషిగా ఎదిగే అవకాశాన్ని ఇచ్చింది కూడా ఈ కష్టాలే..! అందుకే, ఇప్పటి నుంచి నా పూర్తి సమయాన్ని గమ్యం దిశగా ప్రయాణం కొనసాగించటానికి ఉపయోగించాలని నిర్ణయించుకొన్నా. మరిన్ని వివరాలతో త్వరలో మీ ముందుకొస్తా. ఈ బాటసారి ప్రయాణం కొనసాగుతుంది’’ అని నాగబాబు రాసుకొచ్చారు. ఇది కాస్త నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే ఈ పోస్ట్‌ చూసిన నెటిజన్లు ‘‘మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని