మే మూడోవారంలో ఓటీటీలో ‘వైల్డ్ డాగ్‌’ విడుదల? 

నాగార్జున కథానాయకుడిగా అహిషోర్‌ సాల్మాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’. ఈ సినిమా ఏప్రిల్‌ 2న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

Published : 12 Apr 2021 21:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్:  నాగార్జున కథానాయకుడిగా అహిషోర్‌ సాల్మాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’. ఈ సినిమా ఏప్రిల్‌ 2న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఇప్పటికే హక్కులు పొందినట్లు వార్తలొస్తున్నాయి. మే మూడోవారంలో డిజిటల్‌ మీడియాలో విడుదల కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జున ఇందులో ఎన్‌ఐఏ ఏజెంట్‌ విజయ్‌ వర్మగా కనిపించగా సయామీఖేర్‌ రా ఏజెంట్‌గా నటించింది. దియా మీర్జా, అతుల్‌ కుల్‌కర్ణి, అలీ రెజా, అనీష్‌ కురువిళ్ల, ప్రకాష్‌ సుదర్శన్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంరజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించారు. షానైల్ డియో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయగా శ్రావణ్‌ కటికనేని ఎడిటర్‌గా పనిచేశారు. కిరణ్‌ కుమార్‌ డైలాగ్స్ రాశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని