Nagarjuna: నాగ్‌ కోసం మిస్‌ ఇండియా?.. వెండితెరకు పరిచయం చేసే ప్రయత్నం

కథానాయకుడు నాగార్జున (Nagarjuna) తన తదుపరి చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. ఆయన ఇప్పటికే రచయిత ప్రసన్న కుమార్‌ చెప్పిన కథకు పచ్చజెండా ఊపేశారు.

Updated : 25 Feb 2023 07:20 IST

కథానాయకుడు నాగార్జున (Nagarjuna) తన తదుపరి చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. ఆయన ఇప్పటికే రచయిత ప్రసన్న కుమార్‌ చెప్పిన కథకు పచ్చజెండా ఊపేశారు. వచ్చే నెలలో సినిమాని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం కోసం మిగతా తారాగణాన్ని ఖరారు చేసే పనిలో పడింది చిత్ర బృందం. ఈ సినిమాలో హీరో నరేష్‌ (Naresh) ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. కాగా, ఇప్పుడు కథానాయిక ఎవరన్న విషయంలోనూ స్పష్టత వస్తోంది. ఈ చిత్రంలో నాగ్‌కు జోడీగా మాజీ మిస్‌ ఇండియా మానస వారణాసి(Manasa Varanasi)ని ఖరారు చేయనున్నారని సమాచారం. హైదరాబాద్‌కు చెందిన మానస 2020 మిస్‌ ఇండియా విజేతగా నిలిచింది. 2021 మిస్‌ వరల్డ్‌ పోటీల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించింది. ఆమెను ఇప్పుడీ చిత్రంతో వెండితెరకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తోంది చిత్ర బృందం. ప్రస్తుతం కథా చర్చలు తుది దశకు చేరుకున్నాయని.. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుందని తెలిసింది. వినూత్నమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో నాగార్జున విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారట. ఈ ప్రాజెక్ట్‌కు శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని